క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి ఈ పేరు చెప్తే గుర్తుపట్టకపోవచ్చు. కానీ పెళ్ళాం ఊరెళితే సినిమాలో జ్యోతి అంటే టక్కున గుర్తుకువస్తుంది. టాలీవుడ్ లో బోల్డ్ పాత్రలతో జ్యోతి ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. మొదట హీరోయిన్ అవ్వాలని జ్యోతి టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. కానీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. లేడీ కమెడియన్ గాను అనేక సినిమాల్లో నటించి నవ్వులు పూయించింది. జ్యోతి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన హంగామా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత వ్యాంప్ పాత్రలకే పరిమితమైంది.
హంగామా తర్వాత మళ్లీ పెళ్ళాం ఊరెళితే సినిమాలో నటించి ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో బిగ్ బాస్ సీజన్ వన్ లో అడుగు పెట్టింది. కానీ ఫైనల్స్ వరకు హౌస్ లో ఉండలేకపోయింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే అనేక వివాదాలతో వార్తల్లోనూ హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే తాజాగా వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి జ్యోతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అమెరికాలో జరిగే తానా సభలకు సినిమా ఇండస్ట్రీ నుండి కళాకారులు వెళ్లి ప్రదర్శనలు ఇవ్వడం అలాగే మ్యూజిక్ నైట్స్ ఉండటం జరుగుతుంది. అలా సభలకు ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ నుండి తాను కూడా వెళ్లినట్టు చెప్పింది. అయితే ఏవీఎస్ గ్రూప్ లో ఉన్న జ్యోతిని… ఏవీఎస్ నీకు అంతగా నటన రాదు అంటూ చెప్పి వేరే గ్రూప్ కి వెళ్ళమన్నారని తెలిపింది. దాంతో చాలా అవమానంగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఏవీఎస్ గారు వేసే కుళ్ళు జోకులకు నవ్వలేదని… అలాగే ఆయన భజన చేయకపోవడం వల్ల తనను అవమానించారని చెప్పింది. ఒకరి భజన చేయడం తనకు చేతకాదని అలాంటివి ఇంకెవరైనా చేస్తున్నా దూరం ఉండి చూస్తా అంతే అంటూ నాటి సంఘటన గుర్తు చేసుకుని వాపోయింది.
తాను భజనలకు దూరంగా ఉంటానని… ఏవీఎస్ గారు అలా అనడంతో తాను ఏ గ్రూప్ లోకి వెళ్లి పార్టిసిపేట్ చేయాలో అర్థం కాక పరుచూరి గోపాలకృష్ణ గారి వద్దకు వెళ్లి విషయం చెప్తే.. వాడి బొంద నా టీంలో ఉండు నువ్వు.. అంటూ చేర్చుకున్నారని తెలిపింది.