ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద ఒక్క మాట‌తో అంద‌రి హార్ట్ ట‌చ్ చేసిన తార‌క్‌..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా వర్ష సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఎన్టీఆర్‌ నందమూరి వంశ లెగ‌సీని ముందుకు నడిపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తారక్ లేటెస్ట్ భారీ చిత్రం “దేవర” పాన్ ఇండియా లెవెల్లో హైప్ రేపుతోంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ లైన‌ప్‌లో ప్ర‌శాంత్ నీల్‌, ఆ త‌ర్వాత వార్ 2 లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు లైన‌ప్‌లో ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌రిగిన ఆయన తాత దివంగ‌త‌ నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకలకు కొన్ని కారణాల వల్ల హాజరవ్వలేక పోయారు. అందుకే ఎన్టీఆర్ ఈ రోజు మే 28న శత జయంతి రోజు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద ఆయన తాత గారికి నివాళులు అర్పించారు.. ఈ నేపథ్యంలో ఆయనను స్మరించుకుని అక్కడే ఎమోషనల్ అయ్యాడు.

ఎన్టీఆర్ రాకతో ఎన్టీఆర్ ఘాట్‌ మొత్తం ఒకసారిగా జనసముద్రంతో కిక్కిరిసి పోయింది. ఆ మహానీయుని స్మరించు కోవటం కోసం పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు అక్కడికి తరలివచ్చారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్ నివాళులు అర్పించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాత‌కు నివాళులు అర్పించాక‌ ఎన్టీఆర్ తాతా మా హృద‌యాన్ని మ‌రొక్క‌సారి తాకిపో అంటూ ఎమోషనల్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా భావోద్వేగానికి గురి అవుతున్నారు.