టాలీవుడ్లో ఇప్పుడు పవిత్రా లోకేష్, సీనియర్ నటుడు వీకే నరేష్ జంట ఎంత హాట్ టాపిక్గా మారిపోయారో చూస్తూనే ఉన్నాం. గత ఆరేడు నెలలుగా వీరిద్దరి ప్రేమ, సహజీవనం యవ్వారం.. అటు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఫైరింగ్ ఇదంతా ఓ సినిమా, సీరియల్ను తలపించేలా ఉంది. తాజాగా నరేష్, పవిత్ర తన జీవితంలో జరిగిన సంఘటనలనే ఆధారంగా చేసుకుని మళ్లీపెళ్లి సినిమా తెరకెక్కించారు.
నరేష్ స్వయంగా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎంఎస్. రాజు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ట్రెండీ టాపిక్ కావడంతో మళ్లీపెళ్లి సినిమాకు రిలీజ్కు ముందే మంచి హైప్ వచ్చింది. ఇక నరేష్, పవిత్ర టాపిక్పై బాగా ఆసక్తి ఉన్న వారు కూడా ఈ సినిమా చూసేందుకు బాగా ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఈ క్రేజ్, ఈ పాపులారిటీని పవిత్రా లోకేష్ బాగా క్యాష్ చేసుకుంటోన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పవిత్రా లోకేష్కు టాలీవుడ్లో మంచి పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి క్రేజ్ ఉంది. తాజా పరిణామాలతో పవిత్రా లోకేష్కు మరిన్ని బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. దీంతో పవిత్రా లోకేష్ తన రెమ్యునరేషన్ కూడా పెంచేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆమె రోజుకు లక్ష రూపాయల చొప్పున కాల్షీట్లు ఇస్తోందట. అయితే తాజాగా ఆమె దీనిని డబుల్ చేసేసినట్టుగా తెలుస్తోంది. అంటే పవిత్ర రోజు కాల్షీట్ కావాలంటే రోజుకు అక్షరాలా రెండు లక్షల రూపాయిలు సమర్పించుకోవాల్సిందే. ఏదేమైనా పవిత్ర అయితే మామూలుగా డిమాండ్ చేయట్లేదు.