పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ సినిమాలు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలతో గ్లోబల్ హీరోగా అభిమానులను సంపాదించుకున్నారు.
రీసెంట్ గానే ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ప్రభాస్ .. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి ప్లాప్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై భారీ స్థాయిలో ట్రోలింగ్ కూడా జరిగింది. ప్రభాస్ నటన బాగున్న దర్శకుడు ఓంరౌత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నారు.
గత కొద్దిరోజులుగా ఈ సినిమాల షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది. అలాగే తెలుగు దర్శకుడు మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఇదే సమయంలో జూన్ 28 ప్రభాస్ కెరీర్ లోనే ఎంతో స్పెషల్ డే.. ఎందుకంటే ప్రభాస్ హీరోగా తొలి అడుగు వేసిన రోజు. ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్ షూటింగ్ ఆ రోజునే మొదలైంది.
20 సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా, జయంత్ పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2002 జూన్ 28న మొదలుపెట్టారు. ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా అలనాటి మేటి నటి మంజుల కుమార్తె శ్రీదేవి నటించింది. దివంగత నటుడు కృష్ణంరాజు ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. తొలి సినిమాతోనే తన నటనతో ప్రభాస్ ప్రేక్షకులను మెప్పించారు. తర్వాత వచ్చిన వర్షం సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ విజయం అందుకుని బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయ్యాడు.