సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి అప్పటకీ.. ఇప్పటకీ ఓ ఫైర్బ్రాండే. ఆమె నిన్నటి తరంలో తిరుగులేని తారగా వెలుగొందిన స్టార్. ఆ రోజుల్లోనే సినిమాలు సూపర్ హిట్ అవ్వాలంటే హీరోలు అక్కర్లేదు.. తాను ఉంటే చాలు అని నిరూపించిన ఘనత ఆమెది. కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మా, ప్రతిఘటన ఇలా ఎన్నో సినిమాలను ఆమె ఒంటి చేత్తో బ్లాక్బస్టర్ చేసి చూపించింది. ఆ రోజుల్లోనే ఆమె స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకునేవారు.
విజయశాంతికి నందమూరి ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఉంది. బాలయ్య – నందమూరి నటసింహం విజయశాంతి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయన్న సంగతి తెలిసిందే. ఇక
విజయశాంతి గారి భర్త శ్రీనివాస ప్రసాద్ గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. కెరీర్ పరంగా టాప్ పొజిషన్లో ఉండగానే విజయశాంతి శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
శ్రీనివాస ప్రసాద్ నందమూరి ఫ్యామిలీ బంధువు. బాలయ్యే ఆయన్ను విజయశాంతికి మేనేజర్గా పెట్టాడు. విజయశాంతికి మేనేజర్గా జాయిన్ అయిన శ్రీనివాస ప్రసాద్ ఆమె ఆస్తులు చూస్తూ ఆమెకు అత్యంత నమ్మకస్తుడిగా మారారు. ఈ క్రమంలోనే వారి సాన్నిహిత్యం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఇక శ్రీనివాస ప్రసాద్ ఎన్టీఆర్ పెద్ద అల్లుడు అయిన గణేష్ రావు కు మేనల్లుడు అవుతారు.
హీరో బాలకృష్ణ – శ్రీనివాస్ ప్రసాద్ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ స్నేహంతోనే ఆయన్ను విజయశాంతికి మేనేజర్గా నియమించారు. విజయశాంతిని అంతకుముందు కొందరు నమ్మించి మోసం చేశారు. అందుకే బాలయ్య సలహా మేరకే విజయశాంతి శ్రీనివాస ప్రసాద్ను మేనేజర్గా పెట్టుకుంది. ఇక శ్రీనివాస్ ప్రసాద్ బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్స్ ను స్థాపించి “నిప్పు రవ్వ” సినిమా నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా విజయశాంతి నటించిన సంగతి తెలిసిందే.