ఆ హీరోలకు పీడకలగా మిగిలిపోయిన .. ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్లు.. ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు వస్తూ ఉంటాయి. అందులో డైరెక్టర్లు వారు రాసుకున్న కథను బట్టి ఆ సినిమాకు ఇద్దరు హీరోయిన్లు కావాలా లేక ఒక హీరోయిన్ తో సినిమానుచేస్తాడు. ఈ క్రమంలోనే ఒక సినిమాలో నటించిన ఇద్ద‌రు హీరోయిన్లు మళ్లీ మరొక సినిమాలో కూడా కలిసి నటిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ముద్దుగుమ్మల పర్ఫామెన్స్ నచ్చడం ప్రేక్షకుల్లో వారికి మంచి క్రేజీ ఉండటం వల్ల దర్శకులు ఆ హీరోయిన్లనే మళ్లీ సినిమాల్లోకి తీసుకుంటూ ఉంటారు.

ప్రస్తుతం మన టాలీవుడ్ లో వస్తున్న సినిమాల్లో ఎక్కువ శాతం రిపీట్ అయిన కొంతమంది హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం. అలా అందరిలో ముందుగా రిపీట్ అయిన వారిలో సమంత- ప్రణతి.. ఈ ఇద్దరు ముద్దుగములో స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అక్కా చెల్లెలుగా కలిసి నటించి మెప్పించారు. ఇక మళ్లీ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రభస సినిమాలో కూడా ఇద్దరూ అక్కా చెల్లెలు గానే నటించారు.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా మిగిలిపోయింది. అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇద్దరు ముద్దుగుమ్మల తర్వాత సమంత- కాజల్ అగర్వాల్ గురించి చెప్పుకోవాలి. ఈ ముద్దుగుమ్మలు కూడా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బృందావనం సినిమాలో కలిసి అక్క చెల్లెలుగా కనిపించారు. ఈ సినిమా కూడా ఎన్టీఆర్‌కు ఫ్యామిలీ హీరోగా మంచి విజయం అందించింది. మళ్లీ ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాలో కూడా సమంత- కాజల్ కలిసి నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. అలా రెండోసారి రిపీట్ అయినా ఈ హీరోయిన్లతో చేసిన ఆ హీరోల‌కు ఆ సినిమాలు పీడకల మిగిలిపోయాయి.