నటసింహం నందమూరి బాలకృష్ణ ఆయన అభిమానులకు వరుస పెట్టి భారీ ట్రీట్లు ఇచ్చుకుంటూ వెళ్లిపోతున్నారు. యంగ్ హీరోలను మించిన జోరు చూపిస్తూ వరుస సినిమాలతో దడ పుట్టిస్తున్నాడు. ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వకముందే మరో సినిమాను మొదలు పెడుతూ గ్యాప్ లేకుండా టాలీవుడ్ లోనే బిజీ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం నందమూరి అభిమానులంతా బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకేక్కిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వకుండానే బాలయ్య మరో నలుగురు క్రేజీ దర్శకులతో సినిమాలను లైన్లో పెట్టేసాడు. ఇప్పటికే బాలకృష్ణతో సినిమా కోసం టాలీవుడ్ లో ఉన్న ఐదుగురు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య తన 109వ సినిమాను మెగా దర్శకుడు బాబి తో చేయబోతున్నాడు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. భారీ యాక్షన్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ అలాగే ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై త్రివిక్రమ్ నిర్మించనున్నారు.
ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య ఏ దర్శకుడుతో సినిమాకి జై కొట్టబోతున్నారు అనేది ఇప్పుడు ఎంతో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే గతంలో బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేసేందుకు కమిట్మెంట్ ఇచ్చారు బాలయ్య.. దీంతో ఆయన తర్వాత సినిమా బోయపాటి శ్రీను తోనే చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఆ సినిమా కూడా పొలిటికల్ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాల తర్వాత బాలయ్యతో సినిమా కోసం బింబిసారాతో మంచి విజయ అందుకున్న దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారని తెలుస్తుంది.
ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించునున్నారట. ఆ తర్వాత చేయబోయే సినిమాను కూడా మరో యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయడానికి బాలయ్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.ఇక వేరే కాకుండా బాలయ్యతో సినిమా చేయడానికి పరుశురామ్, పూరి జగన్నాథ్ వంటి దర్శకులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది. మరి బాలయ్య ఈ దర్శకుల్లో ఏ దర్శకుడుతో సినిమా చేస్తారో చూడాలి.