ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ప్రాజెక్ట్ కే” . ప్రభాస్ రీసెంట్గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్లో సలార్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక సంక్రాంతికి జనవరి 12న ప్రాజెక్ట్ కేతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే నటిస్తోంది. రెండో హీరోయిన్ గా మరో బాలీవుడ్ భాయ దిశా పటానీ ని రీసెంట్గా ఎంపిక చేశారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడని అంటున్నారు.
ఈ సినిమాలో విలన్గా నటించబోతోన్న కమల్హాసన్కే ఏకంగా రు. 12 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ సహా ఫాంటసీ వండర్ గా తెరకెక్కుతోంది. ఇక టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం దర్శకుడు నాగశ్విన్ అండ్ టీం అయితే ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించారు. లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి ఓ టాక్ విస్తృతంగా వస్తోంది.
ఈ సినిమాలో మన భారతీయ పురాణాలకి సంబంధించి కూడా ఓ టచ్ ఉంటుందట. ఈ క్రమంలోనే కథానుగుణంగా ప్రభాస్ రోల్ పై ఓ బజ్ ఇపుడు కేజ్రీ న్యూస్గా మారింది. ఈ ప్రాజెక్ట్ కేలో ప్రభాస్ విష్ణు అవతారంగా కనిపిస్తాడట. ఇదే నిజం అయితే రేపు థియేటర్లలో ఫ్యూజులు ఎగిరిపోయే విజువల్స్ మనం చూస్తాం. ఇక ప్రభాస్ రెండోసారి విష్ణు అవతారంగా కనిపిస్తున్నాడు.