బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో డర్టీ పిక్చర్స్ అనే సినిమా ద్వారా కుర్రకారును ఆకట్టుకున్న విద్యాబాలన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర రెండు సినిమాల్లో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రను పోషించుగా విద్యాబాలన్ ఎన్టీఆర్ భార్య బసవతారకం రోల్ ప్లే చేసింది.
ఈ పాత్రలో ఆమె అచ్చుగుద్దినట్టుగా ఒదిగిపోయింది. ఇలా టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న విద్యాబాలన్ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. విద్యాబాలన్ ఇటీవల నటించిన నియాత్ మూవీ రిలీజ్కి రెడీ కావడంతో ప్రమోషన్లలో బిజీగా గడుపుతుంది. ఇదే క్రమంలో ఆమె ఫస్ట్ లవ్ గురించి చేసిన డర్టీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
విద్యాబాలన్ తన భర్తను మొదటిసారి చూసినప్పుడు తనకు లస్ట్ ఫీలింగ్ కలిగిందని.. చెప్పడంతో అందరూ షాక్ అయారు. నిజానికి మా ఇద్దరి మొదటి చూపుల్లో నాకు సె..* ఫీలింగ్ కలిగిందని సిద్ధార్థ్ను చూడగానే నాకు సె..* చేయాలన్న కోరిక మనసులో కలిగిందని విద్యా చెప్పింది. ఎందుకంటే ? అతడు చాలా అందంగా మంచి లుక్స్ తో ఉంటాడని.. దాంతో అతనిపై అట్రాక్షన్ ఏర్పడిందని చెప్పింది.
ఆ తర్వాత అతను నన్ను సెక్యూర్డ్ గా చూసుకునే విధానం నచ్చి అతడితో ప్రేమలో పడ్డానని వివరించింది. సిద్ధార్థ ఆమెకు అన్ని విషయాల్లో సపోర్టివ్ గా ఉంటాడని.. ఇలా చాలా తక్కువ మంది భర్తలు ఉంటారని తన తండ్రి తర్వాత అంతగా ప్రేమను చూపించింది తన భర్తే అని చెప్పింది విద్య. అప్పుడే అతడిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని అనుకున్నట్టే సిద్ధార్థ్ని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నానని వివరించింది.