నిహారిక కొణిదెల..ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. మెగా ఫ్యామిలీ గురించి కొన్ని రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మెగా ఫ్యామిలిలో ముందు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య ముందు నుంచే ప్రేమలో ఉండగా వీరు ఎప్పుడు బయటపడలేదు. తాజాగా వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకొని పుకార్లకు చెక్ పెట్టారు. వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరగగా త్వరలోనే వీరి వివాహం జరగనుంది.
ఆ తరువాత కొన్ని రోజులకే రామ్ చరణ్-ఉపాసన ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఆ రెండు రోజులు మెగా ఫ్యామిలి సందడే సందడి ఉండింది. అయితే ఆ తరువాత కొన్నిరోజులకే నిహారిక- చైతన్య విడాకులు తీసుకున్నారు. ముందు నుంచే వీరు విడాకులు తీసుకున్నారు అనే వార్తలు చక్కర్లు కొత్తగా ఎవ్వరు స్పందించలేదు. తాజాగా వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ లో చైతన్య కనిపించకపోవడంతో నిజంగానే వీరు విడాకులు తీసుకున్నారు అనే వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.
తాజాగా కేసు వివరాలు బయటికి రావడంతో నిహారిక స్పందించింది. చైతన్యతో గత నెల జూన్ 5వ తేదీన విడాకులు మంజూరు అయ్యాయి అని అధికారిగా ప్రకటన వచ్చేసింది. అప్పటి నుంచే నిహారిక ఒంటరిగా ఉండిపోయింది. అయితే తాజాగా వేణుస్వామి నిహారిక విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే పవన్ కల్యాణ్ రెండు సార్లు విడాకులు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.
అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా ఇద్దరు భర్తలతో విడిపోయింది. దీంతో ఇప్పుడు నిహారిక జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే నిహారిక చైతన్యతో విడిపోతుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ముందే చెప్పాడంట. ఇప్పుడు నిహారిక జాతకం ప్రకారం ఆమె మళ్లీ పెండ్లి చేసుకున్నా సరే విడాకులు తీసుకుంటుందని వేణుస్వామి చెప్పేశాడు.
అంతే కాదు ఆమెకు పెండ్లి అయినా సంతానం కలగదు అనే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె జాతకంలో దోషం ఉందని.. అందుకే ఇలా జరుగుతోందని వేణుస్వామి చెప్పారు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆయన చేసిన కామెంట్లకు మెగా ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.