వెంక‌టేష్ – రోజా మాట్లాడుకోనంత శ‌త్రువులుగా మార‌డానికి సౌంద‌ర్యే కార‌ణ‌మా…!

చిత్ర పరిశ్రమలో కొన్ని జంటలు ఎంతో అందంగా ఉంటాయి. వారి సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. అలాంటి మెమొరబుల్ జంటల్లో వెంకటేష్- సౌందర్య కూడా ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో పవిత్ర బంధం, రాజా, దేవీపుత్రుడు, పెళ్లి చేసుకుందాం రా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సూపర్ పోలీస్, జయం మనదేరా వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లో బ్లాక్ బ‌స్టర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ జంటకు చిత్ర పరిశ్రమలోని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. కానీ గతంలో ఓ సినిమా విషయంలో మాత్రం వెంకటేష్- సౌందర్య మీద ఉన్న ఇష్టంతో మరో హీరోయిన్ కి విలన్ గా మారిపోయాడు. అలా వెంకటేష్ విలెన్ గా మారిన హీరోయిన్ మరెవరో కాదు… ప్రస్తుతం సినిమాల్లో రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న రోజా. గతంలో వెంకటేష్- రోజా కాంబినేషన్లో పోకిరి రాజా సినిమా వచ్చి ప్లాప్‌ అయ్యింది.

అయితే తర్వాత వెంకటేష్- రోజా కాంబినేషన్లో మరో సినిమా తీయాలని టాలీవుడ్ పెద్దలు భావించారు. ఆ సినిమా మరేదో కాదు రాజా. కోలీవుడ్లో రాజా సినిమాలో హీరోయిన్‌గా రోజా న‌టించింది. దాంతో తెలుగులో కూడా రోజాను హీరోయిన్‌గా తీసుకోవాలని సినీ మేకర్స్ భావించారు. కానీ అదే సమయంలో వెంకటేష్- సౌందర్య జంట‌కి ఉన్న క్రేజ్ చూసి సినిమా యూనిట్ తమ నిర్ణయాన్ని మార్చుకొని రోజా ప్లేస్ లో వెంకటేష్ కు జంటగా సౌందర్యను తీసుకున్నారు.

అయితే ఆ సమయంలో రోజా ఎంతో బాధపడిందట.. కొంతమంది ఇండస్ట్రీ పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లి వెంకటేష్ నన్ను కావాలని ఆ సినిమా నుంచి తప్పించాడు అంటూ బాధపడింద‌ట‌. కానీ అసలు ఈ సినిమా విషయంలో వెంకటేష్ తప్ప ఏమీ లేదు అంత ఆ సినిమా యూనిట్ వారే చేశార‌ని మ‌రో టాక్ కూడా ఉంది. కానీ రోజా అప్పటి నుంచి వెంకటేష్ ని ఒక శత్రువుగా భావించిందట. అస‌లు వెంక‌టేష్‌తో క‌లిసి చేసేందుకే ఇష్ట‌ప‌డ‌లేద‌ని అంటారు. వెంకటేష్- సౌందర్య కాంబోలో వచ్చిన రాజా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందరికీ తెలిసిందే.