సినీ ఇండస్ట్రీలో మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లవ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది. ఇండస్ట్రీలో అందరు వీరి నిశ్చితార్థంకి హాజరయ్యారు. ఇటలీలో వీరి వివాహం జరుగుతుందనే టాక్ నడుస్తోంది. అయితే పెళ్ళికి ముందే లావణ్యకు వరుణ్ తేజ్ షాక్ ఇచ్చాడు. ఆ ఆంటీ హీరోయిన్ తో డేట్ కు వెళ్తానని వార్తలు ఇప్పుడు లావణ్యకు టెన్షన్ పెట్టాయి. అసలేం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం.
వరుణ్ తేజ్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఆగష్టు నెల 25వ తేదీన గాండీవధారి అర్జున సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాపై వరుణ్ తేజ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. ఆ తరువాత చిరంజీవి ఛాలెంజ్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు. అయితే తాజాగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడారు.
ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితో ఒకరోజు ఉండాలంటే ఎవరితో ఉంటారని అడగగా కళ్యాణ్ బాబాయ్ తో ఉంటానన్నారు. రమ్యకృష్ణతో డేట్ కు వెళ్లాలని ఉందని, చిన్నప్పటి నుంచి ఆమె అంటే ఎంతో అభిమానమని వరుణ్ తేజ్ చెప్పారు. వరుణ్ చెప్పిన ఈ మాటలు కొన్ని క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్ రమ్యకృష్ణ పేరు చెప్పి లావణ్య త్రిపాఠికి షాకిచ్చారని అనుకుంటున్నారు.
ఏ డైరెక్టర్ తో నటించాలని ఉంది అని అడగగా..శ్రీమంతుడు తీసిన డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో నటించాలని ఉందని, ఆయన సినిమాలల్లో శ్రీమంతుడు సినిమా అంటే తనకి చాలా ఇస్తామని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్స్ కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.