మెగా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌… వ‌రుణ్ – లావ‌ణ్య పెళ్లి మ‌రీ ఇంత చీఫ్‌గానా…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్సెస్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన విషయం మనందరికీ తెలిసిందే. నిశ్చితార్థం మాత్రం చాలా అంగరంగ వైభోగంగా చేసుకున్నారు. అయితే నవంబర్ లో వీరి పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఏమైందో ఏంటో తెలియదు కానీ సడన్గా ముహూర్తాన్ని ఆగస్టు 25 కి మార్చేసుకున్నారట మెగా ఫ్యామిలీ. దీనికి సంబంధించిన పెళ్లి పనులు సైతం చక చక పూర్తి చేస్తుంది మెగా ఫ్యామిలీ అంటూ టాక్ వినిపిస్తుంది. దీనికి తగ్గట్టే వరుణ్, లావణ్య కూడా ఇటలీలో దిగిన ఫొటోస్ నెట్టింట వైరల్ కావడంతో త్వరలోనే వీళ్ళ పెళ్లి జరగబోతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా అందిన సమాచారం ఏమిటంటే లావణ్య, వరుణ్ పెళ్లి ఇటలీలో జరగబోతుందని… అయితే ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు అటెండ్ కావడం లేదని…. కేవలం 50 మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతారని సెక్యూరిటీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మాత్రమే ఈ పెళ్లికి అటెండ్ అవుతారని… మిగతా వాళ్ళందరూ హైదరాబాదులో చేసే రిసెప్షన్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తుంది.

అయితే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఇంత కామ్ గా పెళ్లి చేసుకున్న హీరోనే లేరు. అందరి పెళ్ళికి వేలల్లో జనాభా కూడా హాజరయ్యారు. కానీ వరుణ్, లావణ్య పెళ్లికి మాత్రం నాగబాబు ఇలా సింపుల్ గా అవగొట్టేస్తున్నాడు. దీంతో మెగా అభిమానులు షాక్ అవుతున్నారు. రేపో మాపో పెళ్లి అందరి హీరోలు కలిసి నీ పెళ్లిలో సందడి చేస్తే చూడాలనుకున్నాం ఇలాంటి షాక్ ఇచ్చారు ఏంటి మీరు..? అంటూ మెగా అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.