స్టార్ హీరోలకి కూడా లేని గ‌ట్స్ వాణిశ్రీకే సొంతం… ఎంత డేరింగ్ ప‌ని చేసిందో చూడండి..!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్‌ వాణిశ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , కృష్ణ , శోభన్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. సావిత్రి , జమున తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ కావడం గమనార్హం. వాణిశ్రీ సినిమాలు చేయ‌డం అపేశాక‌ కొన్ని సంవత్సరాల‌ పాటు జాతీయ అవార్డుల కమిటీలో మెంబర్‌గా కూడా పనిచేశారు.

వాణిశ్రీ తాను సినిమాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఎంతో నిక్కచ్చిగా ఉండే మనిషి. ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే దానికి వెన‌క్కి తగ్గే వారే కాదు. అందువల్లే ఈమె హీరోయిన్‌గా, నటిగా సక్సెస్ అయ్యారని అందరూ అంటూ ఉంటారు. వాణిశ్రీ తన జీవితంలో ఎప్పుడూ తన నమ్మిన ధర్మాన్ని పాటించే మనిషి. ఎంతలా అంటే తన ఆస్తి కాజేసిన తన సొంత అక్క బావలపై కేసు వేసి ఆస్తిని తిరిగి దక్కించుకొని మళ్ళీ వారు లేవలేని చివరి రోజుల్లో వారిని తన ఇంట్లో పెట్టుకుని వారికి ఎన్నో సేవలు కూడా చేసింది.

వాణిశ్రీ అవార్డు కమిటీలో ఉన్న సమయంలో ఎవరు ఊహించని ఓ సంఘటన జరిగింది. 2004లో మోహన కృష్ణ ఇంద్రగంటి తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా గ్రహణం. ఈ సినిమా విమర్శకుల దగ్గర నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుని ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. అయితే ఈ సినిమాని కూడా జాతీయ అవార్డుల కమిటీకి పంపినప్పుడు.. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం లాంటి చాలా అవార్డులకి నామినేట్ అయినా కూడా మొదటిసారిగా దర్శకత్వం వహించిన వారికి జాతి స్థాయిలో ఇచ్చే ఇందిరాగాంధీ మెమోరియల్ అవార్డును మోహన కృష్ణ ఇంద్రగంటి కి ఇచ్చారు.

ఇదే సమయంలో మోహన కృష్ణ ఇంద్రగంటి ఆ అవార్డుల విషయంలో తనకి అన్యాయం జరిగిందంటూ గతంలో ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో వాణిశ్రీ ఆ ఇంటర్వ్యూ పై తన అగ్రహాన్ని వెలగెక్కారు. గ్రహణం సినిమాకు ఉత్తమ మూవీ, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమా ఆటోగ్రఫీ అవార్డులు కూడా రావాల్సి ఉంది. కానీ ఈ అవార్డ్స్ కోసం కొందరు లాబీయింగ్ చేయటం కార‌ణంగా ఆ అవార్డులు వేరే సినిమాలకు వెళ్లిపోయాని వాణిశ్రీ చెప్పుకొచ్చింది.

వాణిశ్రీ చేసిన ఈ కామెంట్లు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఆ సంవత్సరం అవార్డ్స్ అందుకున్న సినిమాలపై కూడా మీడియాతో పాటు ఎందరో నటులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా మొదటి నుంచి ఈ అవార్డుల విషయంలో లాబీయింగ్ జరుగుతుందనేది అందరికీ తెలిసిందే. కానీ అన్నీ తెలిసిన ఎవరు ఆ విషయల‌పై మాట్లాడకుండా ఎవరి పని వారు చూసుకుంటూ వెళ్లిపోతారు. అలాంటిది ఎవరు టచ్ చేయని వాటిని కూడా వాణిశ్రీ భయపడకుండా నిజాలు బయటపడటం అనేది మామూలు విషయం కాదు. అందుకే వాణిశ్రీ ఇప్పుడున్న స్టార్ హీరోలు కన్నా ఎంతో బెటర్