ప‌వ‌న్‌ను ఏపీ సీఎం చేసేసిన క్రేజీ హీరోయిన్‌.. జ‌గ‌న్‌కు ఝుల‌క్‌..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు రెడీ అవుతోన్న వేళ ఓ క్రేజీ హీరోయిన్ ప‌వ‌న్‌ను ముందుగానే సీఎంను చేసేసింది. ఆమె ఎవ‌రో కాదు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఆమె తాజాగా చేసిన ట్వీట్ ప‌వ‌న్ అభిమానుల‌కు నిజంగానే ఎక్క‌డా లేని సంతోషాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్‌ను ఏకంగా ఆంధ్రప్ర‌దేశ్ సీఎం అంటూ ఊర్వ‌శీ ట్వీట్ చేసింది. దీంతో జ‌న‌సైనికులు సంతోషం మామూలుగా లేదు.

ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌వ‌న్ – సాయిధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించిన బ్రో సినిమా రిలీజ్ అవుతోంది. ఈ బ్రో సినిమా స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ట్వీట్ట‌ర్ వేదిక‌గా. ఏపీ గౌరవ సీఎం పవన్ కళ్యాణ్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది.. సినిమా విడుద‌ల‌కు త‌న శుభాకాంక్ష‌లు చెపుతున్నా అని పోస్ట్ చేసింది.

ఈ ట్వీట్‌తో ఆమె ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఝుల‌క్ ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఆమె బ్రో సినిమా రిలీజ్ అవుతుందంటూ శుభాకాంక్షలు చెప్ప‌డం బాగున్నా.. ఆమెకు క‌నీసం జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ లేదా .. ఏపీ సీఎం జ‌గ‌న్ క‌దా ? అని జ‌గ‌న్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వ‌శి చేసిన ట్వీట్‌పై జ‌గ‌న్ ఫ్యాన్స్ మండిప‌డుతుంటే… ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం మాంచి ఖుషిగా ఉన్నారు.