ఇండియన్ సినిమా సెలబ్రిటీలు వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. గత రెండు, మూడేళ్లలో చూస్తే ఎంతో మంది సినిమా వాళ్లు విడాకులు తీసుకున్నారు. పెళ్లయ్యి ఏళ్లకు ఏళ్లుగా సంసారాలు చేసి.. పిల్లలను కన్న వారు కూడా అనూహ్యంగా విడాకులు తీసేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ – దీపిక పదుకొనే వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గతంలో వీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమగా లేరని.. రణ్వీర్ – దీపిక మధ్య ఏవో మనస్పర్ధలు కారణంగా వీరు ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారంటూ గుసగుసలు వస్తున్నాయి. రణ్వీర్ రెచ్చిపోయి న్యూ..* ఫొటో షూట్ చేస్తుంటే.. దీపిక పదుకొనే బో…* సీన్లతో రెచ్చిపోయిందంటూ అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి.
వీటిపై స్పందించిన దీపిక – రణ్వీర్ ఇవన్నీ పుకార్నలేనని చాలాసార్లు నిరూపించారు.
ఈసారి మాత్రం వీరిద్దరి డివోర్స్ కచ్చితంగా జరగబోతుంది అంటూ.. కాంట్రవర్షియల్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ట్విట్ చేశాడు. అఫీషియల్ బ్రేకింగ్ న్యూస్ అనే టాగ్తో.. రణ్వీర్ సింగ్ – దీపిక పదుకొనే ఒకరి నుంచి ఒకరు వేరయ్యారు.. విడాకుల ముందే విడిపోయారు. ఇలా జరుగుతుందని నేను గత ఏడాదే చెప్పాను అంటూ ఈ జంట కలిసి ఉన్న ఒక మంచి ఫోటోను నెట్టింటే షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో రణ్వీర్, దీపిక ఫ్యాన్స్ ఉమైర్ని తిట్టిపోస్తున్నారు. మరి కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పడేస్తున్నారు. మరి కొంతమంది రణ్వీర్ ఓ ఆంటీకి ట్రై చేస్తున్నాడంటూ ఈ కారణంగానే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారంటూ కామెంట్ చేస్తున్నారు.