ఆ విషయంలో యూటర్న్ తీసుకున్న త్రివిక్రమ్.. పాన్ ఇండియా స్టేటస్ కోసం ఆ హీరోని వాడుకుంటున్నాడా..?

టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునింది. ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంటుందని మహేష్ అభిమానులు ఎంతో కచ్చితంగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎన్నోసార్లు వాయిదా పెడుతూ రాగా ప్రస్తుతం ఎంతో శ‌ర‌వేగంగా జరుగుతుంది.

ఇక ఈ సినిమాని ఎంతో త్వరగా పూర్తిచేసి ఇటు మహేష్ అటు త్రివిక్రమ్ కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు.ఇక త్రివిక్రమ్ ఎప్పటికే తన గత సినిమాలు అలా వైకుంఠపురం తో రూ.200 కోట్లు పైగా కలెక్షన్లు అందుకున్నాడు. ఈ స్టార్ దర్శకుడు ఇప్పటికీ రీజినల్ సినిమాలు తోనే కాలం గడిపేస్తున్నాడు. ప్రస్తుత రోజుల్లో చిన్నచిన్న దర్శకులే పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతుండగా త్రివిక్రమ్ మాత్రమే ఇంకా అటువైపు అడుగులు వేయడం లేదు. ఆయనతో పాటుగా టాలీవుడ్లో స్టార్ దర్శకులుగా ఉన్న సుకుమార్, రాజమౌళి ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలతో తమ క్రేజ్ ని పెంచుకున్నారు.

ఇక‌ ఇప్పుడు త్రివిక్రమ్ ఆ రేంజ్ లో తన క్రేజ్‌ను ఎప్పుడు పెంచుకుంటాడని సందేహాలు వస్తున్నాయి. ఇక దీనికి త్వరలోనే సమాధానం చెబుతారు అంటూ ఓ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.మహేష్ సినిమా తర్వాత త్రివిక్రమ్ చేయబోయే తర్వాత సినిమాల కథలు కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. తాజాగా మహేష్ తో సినిమా అయిన వెంటనే త్రివిక్రమ్ – అల్లుఅర్జున్‌తో సినిమా చేస్తాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్‌గామారింది.

అలాగే అల్లుఅర్జున్‌తో పాటు ఎన్టీఆర్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు.ఇక ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలు కూడా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సినిమాలు కూడా ఈ హీరోలు పాన్‌ ఇండియా రేంజ్ లోనే వెళ్తున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాని ఏ హీరోతో మొదలుపెట్టిన అది పాన్ ఇండియా సినిమానే అవ్వబోతుంది. ఇదే సమయంలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ తోనే తన మొదటి పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరి గురూజీగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూడాలి.