ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఒక సినిమాను నటించడం మొదలు పెట్టిన తర్వాత ఏవో కారణాలతో పోస్ట్ ఫోన్ చేయాల్సిన సందర్భాలు అప్పుడపుడు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం మహేష్ బాబు నటించిన ‘ గుంటూరు కారం ‘ సినిమా పొజిషన్ కూడా అలానే ఉంది. ఏ నిమిషంలో ఈ సినిమాను మహేష్ బాబు మొదలుపెట్టాడో తెలియదు కానీ సినిమా షూటింగ్ మొదటి నుంచి అవాంతరాలు వస్తూనే ఉన్నాయి.
అసలు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే మహేష్ ఇంట్లో కృష్ణ గారు చనిపోవడంతో పాటు ఒకటి రెండు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఆ తర్వాత రెండు, మూడుసార్లు మహేష్ విదేశీ వెకేషన్కు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఫొటోస్ లీక్ అవడం, షూటింగ్ పోస్ట్ పోన్ అవడం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యింది.
ఏదైనా ఓ స్టార్ హీరో సినిమా ఇన్నిసార్లు పోస్ట్ ఫోన్ అయిన చెత్త క్రెడిట్ కేవలం గుంటూరు కారం సినిమాకే దక్కిందనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం మూవీ గురించి మరో న్యూస్ లీక్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. క్రియేటివ్ డిఫరెన్స్ లు వచ్చి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ఈ సినిమాపై ఓ రేంజ్ లో ట్రోల్స్ జరుగుతున్నాయి. అసలు దీనంతటికీ కారణం త్రివిక్రమ్ అని, అతడి ఓవరాక్షన్ తోనే పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుందని.. ఇప్పుడు పిఎస్ వినోద్ కూడా వెళ్లిపోయాడని గుంటూరు కారం సినిమా ఇలా అవడానికి త్రివిక్రమే కారణమంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్నారు. ఇక వీఎస్ వినోద్ ప్లేస్ లోకి కేఎస్. రవిచంద్రన్ వస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ దీనిపై ఎలా ? స్పందిస్తాడో చూడాలి.