ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 20 ఏళ్ల తన సినీ కెరీర్లో త్రివిక్రమ్ ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలన్నిటిలో ఖలేజా, అజ్ఞాతవాసి మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. ఇక మహేష్ బాబు నటించిన ” అతడు ” సినిమాతో త్రివిక్రమ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ త్రివిక్రమ్కు రావడానికి గుణశేఖరే కారణమన్న విషయం ఇప్పుడు బయట పడింది.
మహేష్ బాబు – గుణశేఖర్ కాంబినేషన్లో ‘ ఒక్కడు ‘, ‘ అర్జున్ ‘ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక్కడు సినిమా భారీ బ్లాక్ బాస్టర్ కాగా అర్జున్ సినిమా యావరేజ్ గా నడిచింది. ఆ తర్వాత సైనికుడు డిజాస్టర్. త్రివిక్రమ్ డైరెక్షన్లో మొదట నువ్వే నువ్వే సినిమా రిలీజై సక్సెస్ అయ్యింది. త్రివిక్రమ్ తన మొదటి సినిమానే మహేష్ బాబుతో తీయాలని అనుకున్నాడట. మహేష్ బాబు వేరే సినిమాల్లో బిజీగా ఉండడంతో ‘ నువ్వే నువ్వే ‘ సినిమాను పూర్తి చేశాడు.
అప్పట్లో మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వెయిట్ చేయకుండా త్రివిక్రమ్ వేరే సినిమాలు తీయడంతో మహేష్ బాబుకు కోపం వచ్చిందట. దాంతో త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి మహేష్ ఒప్పుకోలేదని.. గుణశేఖర్ ఆ గొడవను తెలుసుకొని వారిద్దరి గొడవలు పరిష్కరించి అతడు సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లాడని.. అలాంటి గుణశేఖర్ కెరీర్ని ప్రస్తుతం త్రివిక్రమ్ దెబ్బతీసేలా చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
గుణశేఖర్ తీసుకున్న హిరణ్యకశ్యప లైన్ తో త్రివిక్రమ్ కూడా రానాకు స్క్రిప్ట్ అందిస్తున్నాడన్న టాక్ బయటకు వచ్చేసింది. ఈ లైన్పై గుణశేఖర్ నాలుగేళ్లుగా వర్క్ చేస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలో గుణశేఖర్ తన అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ కావడానికి గుణ శేఖర్ హెల్ప్ చేస్తే.. అతడి కెరీర్ దెబ్బ తీయడానికి త్రివిక్రమ్ ఇలా చేస్తాడా అంటూ త్రివిక్రమ్పై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్.