తెలుగు సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నయనతార, త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు హీరోయిన్లు నటించిన తెలుగు సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఈ ఇద్దరు హీరోయిన్లకు స్టార్ స్టేటస్ రావడంలో, హిందీతో పాటు ఇతర భాషల్లో మంచి గుర్తింపు రావడంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పాత్ర ఎంతో ఉంది. అయితే త్రిష, నయనతార ప్రస్తుతం తెలుగు సినిమాలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
ఈ ఇద్దరు హీరోయిన్లు ఎక్కువ పారితోషికం, ఎక్కువ ఆఫర్లను టాలీవుడ్ నుంచి అందుకున్నారు. అయితే అన్నం పెట్టిన టాలీవుడ్ విషయంలో త్రిష, నయనతార ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని చెప్పవచ్చు. మరోవైపు పెళ్లి తర్వాత నయనతార కెరీర్ ఆశాజనకంగా లేదు. నయనతార కంటే త్రిషకే తమిళంలో చెప్పుకోదగ్గ ఆఫర్లు వస్తున్నాయి. విఘ్నేష్ శివన్ కు సైతం మూవీ ఆఫర్లు తగ్గుతున్నాయి.
త్రిష, నయనతార ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని నిర్లక్ష్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో టాలీవుడ్ డైరెక్టర్లు, నిర్మాతలు సైతం ఇదే విధంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. ఇలియానా, మరి కొందరు హీరోయిన్లు తెలుగు సినిమాలను నిర్లక్ష్యం చేసి ప్రస్తుతం కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో తెలిసిందే. త్రిష, నయనతారలకు సైతం రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
మరోవైపు కోలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని తెలుస్తోంది. త్రిష, నయనతార ఒకరిపై ఒకరు పైచేయి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో విజయాలను అందుకుంటే త్రిష మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో విజయాలను అందుకోలేదు. నయనతార, త్రిష ఒకరి సినిమాలలో మరొకరు నటించడానికి కూడా ఆసక్తి చూపడం లేదని సమాచారం అందుతోంది.