సాధారణంగా చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు ఒకే సమయంలో బాక్సాఫీస్ బరిలో చిన్న పెద్ద సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. అలా పోటీకి దిగిన సందర్భాలో రెండు సినిమాలు హిట్ అవుతాయి లేదా మరికొన్ని సమయాల్లో రెండు సినిమాలు ప్లాప్ అవుతాయి. ఇలా బాక్సాఫీస్ వద్ద ఎప్పటి నుంచో స్టార్ హీరోల సినిమాలకు తీవ్రమైన పోటీ ఉంది. ఇలాంటి పోటీ సరిగ్గా 1984లో ముగ్గురు స్టార్ హీరోల మధ్య ఏర్పడింది. ఆ ముగ్గురు హీరోల సినిమాలు 1984 ఆగస్టులో కేవలం రోజుల వ్యవధిలోనే బాక్సాఫీస్ బరిలోకి దిగాయి.
అలా వచ్చిన ఆ మూడు సినిమాల్లో ఏ సినిమా మంచి విజయం అందుకుంటుందని అప్పట్లో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు. అల వచ్చిన వాటిలో రెండు సినిమాల్లో సీనియర్ హీరోలు నటించగా మరో సినిమాలో యంగ్ హీరో నటించడం మరో విశేషం. ఆ మూడు సినిమాల్లో ముందుగా వచ్చిన సినిమా నటభూషణ శోభన్ బాబు నటించిన ఇల్లాలు ప్రియురాలు. ఈ సినిమాను కోదండ రామిరెడ్డి తెరకెక్కించగా. ఈ సినిమాలో శోభన్ బాబుకు జంటగా సుహాసిని, ప్రీతి హీరోయిన్లుగా నటించారు.
ఇక ఆగస్టు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మహిళల నుంచి మంచి ఆదరణ లభించింది. అంతేకాకుండా మంచి విజయం అందుకుంది. అదే సమయంలో ఈ సినిమాకి పోటీగా మరో రెండు సినిమాలు ఒకేరోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో రెండో సినిమా సూపర్ స్టార్ కృష్ణ నటించిన బంగారు కాపురం, చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవటం మరో విశేషం.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శోభన్ బాబు హీరోగా వచ్చిన ఇల్లాలు ప్రియురాలు, సినిమాను చిరు ఛాలెంజ్ ఈ రెండు సినిమాలను తెరకెక్కించింది కోదండ రామిరెడ్డి కావడం మరో విశేషం. కృష్ణ హీరోగా వచ్చిన బంగారు కాపురం సినిమాకి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇలా ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడంతో మెగాస్టార్ ఛాలెంజ్ సినిమాకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా ఆ సంవత్సరం ఒకే నెలలో ఈ మూడు సినిమాలు పోటీకి దిగగా అందులో శోభన్ బాబు- చిరంజీవి విజయం సాధించగా కృష్ణ నటించిన బంగారు కాపురం మాత్రం యావరేజ్గా నిలిచిపోయింది. ఇలా ఈ బాక్సాఫీస్ పోటీలో చిరంజీవి- శోభన్ బాబు విజేతలుగా నిలిచారు.