ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు దివంగత నటుడు ఉదయ్ కిరణ్. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో.. స్టార్ హీరోగా మారుతాడు అనుకునే సమయానికి ఉదయ్ కిరణ్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చాడు.
ఉదయ్ స్టార్ హీరోగా మారుతాడు అనుకున్న సమయంలోనే అవకాశాలు తగ్గాయి అ సమయంలోనే ఆయన పెళ్లి చేసుకుని కాస్త ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన వారిలో చాలామంది నటులు మరణించారనే విషయం చాలా మందికి తెలియదు. ఒకే సినిమాలో ఉదయ్కిరణ్ తో పాటు కలిసి నటించిన అగ్ర నటులంతా మరణించారు.
ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వు నేను సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సీనియర్ దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించగా.. ఈ సినిమాలు ఇతర ముఖ్యపాత్రలో నటించిన చాలామంది నటులు మరణించారు.
ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ తో పాటు నటించిన ధర్మవరకు సుబ్రహ్మణ్యం, ఎమ్ ఎస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, అలాగే వైజాగ్ ప్రసాద్ కూడా మరణించారు. ఇలా ఓకే మూవీలో కలిసి నటించిన వీరంతా ఇప్పుడు ఈ లోకంలో లేకపోవడం నిజంగా బాధాకరమే.