టాలీవుడ్ లో ప్రస్తుతం తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరు ? అంటే అందరి నోటా వినిపించే పేరు శ్రీలీల. ఆమె ఏ ముహూర్తాన టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందో కానీ అక్కడ నుంచి వరుస హిట్లతో తిరుగులేకుండా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు 7 – 8 సినిమాలు ఉన్నాయి. బాలయ్య, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వైష్ణవ తేజ్, రవితేజ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.
ఒకేసారి వరుసగా ఇన్ని అవకాశాలు రావడంతో ఆమె అన్ని సినిమాలకు సమానంగా డేట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి వచ్చేసింది. దీంతో స్టార్ హీరోలు, సీనియర్ హీరోల సినిమాలకు ఒకలా.. చిన్న హీరోల సినిమాలకు మరోలా ఆమె డేట్లు సర్దుబాటు చేస్తుందని.. శ్రీలీలలో వచ్చిన ఈ మార్పుతో టాలీవుడ్ గరం గరం లాడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు గుంటూరు కారం, బాలయ్య భగవంత్ కేసరి, అటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలలో నటిస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె వైష్ణవ్ తేజ్- సితార సంస్థ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదికేశవ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే శ్రీలీల డేట్లు ఇవ్వకపోవడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వలేదని తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్ లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని టాక్. ఆ టైంలో పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
శ్రీలీల ఇచ్చిన షాక్ తో ఆది కేశవ సినిమా అక్టోబర్ లేదా నవంబర్ లో రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. వైష్ణవ తేజ్ కు ఉప్పెన సినిమా తర్వాత కాలం కలిసి రావట్లేదు. ఆదికేశవ సినిమాతో అయినా ఈ ఏడాది మంచి హిట్ కొడదాము అనుకుంటే శ్రీలీల ఇచ్చిన షాక్ తో ఈ సినిమా పరిస్థితి కూడా గందరగోళంగా మారింది.
దీనికి తోడు వైష్ణవ తేజ్ మరో సినిమా కూడా కమిట్ కాలేని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా శ్రీలీల స్టార్ హీరోల సినిమాలకు ఒకలా.. చిన్న హీరోల సినిమాలకు ఒకలా పని చేస్తుందన్న విమర్శలు అప్పుడే ఆమెపై మొదలైపోయాయి.