కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు..ఇద్దరు రెండో విడతలో మంత్రి పదవి ఛాన్స్ కొట్టేసిన నేతలు. అయితే కాస్త రాజకీయాలు తెలిసిన వారికి తప్ప..మిగతా ప్రజలకు వీరు మంత్రులు అనే సంగతి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. ఇక వీరి సొంత నియోజకవర్గాల్లోనే కాస్త ఐడియా ఉండవచ్చు. అప్పుడప్పుడు కారుమూరి టీవీ డిబేట్లలో కనిపిస్తారు కాబట్టి..జనాలకు ఆయన కాస్త తెలిసే ఛాన్స్ ఉంది. అంటే జనాలకే పెద్దగా తెలియడం లేదంటే..మంత్రులుగా వీరి పని తీరు ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
దేవాదాయ శాఖ మంత్రిగా కొట్టు ఉన్నారు..మరి ఆ శాఖలో ఈయన చేసే పనులు ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనేది ఎవరికి అవగాహన లేదు. ఇక పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరి ఉన్నారు. మరి ఈయన శాఖా పరంగా చేసేవి కనబడటం లేదు. ఇలా మంత్రులుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన వీరు ఎమ్మెల్యేలుగా తమ నియోజకవర్గాల్లో కూడా పెద్దగా చేసింది ఏమి లేదనే విమర్శలు వస్తున్నాయి.
కొట్టు..తాడేపల్లిగూడెం నుంచి, కారుమూరి..తణుకు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో పెద్దగా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. అందరికీ వచ్చినట్లే ప్రభుత్వ పథకాలు మాత్రం వస్తున్నాయి..మరి మంత్రులుగా వీరు స్పెషల్ గా చేసేది ఏమి కనిపించడం లేదు. దీని వల్ల సొంత స్థానాల్లోనే ఇద్దరు మంత్రులు వ్యతిరేకత తెచ్చుకున్నారు. రెండుచోట్ల టిడిపి బలపడుతుంది. తణుకులో టిడిపి నేత అరిమిల్లి రాధాకృష్ణ పికప్ అయ్యారు. గత ఎన్నికల్లో కేవలం 2 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు లీడ్ వచ్చింది.
అటు తాడేపల్లిగూడెంలో కొట్టుకు పెద్ద ప్లస్ లేదు. ఇక్కడ టిడిపి, జనసేన బలపడ్డాయి. అయితే టిడిపి-జనసేన గత ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్లే వీరు గెలిచారు. కానీ ఈ సారి ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈ ఇద్దరు మంత్రులు..డౌట్ లేకుండా ఓడిపోయే ఛాన్స్ ఉంది.