దర్శకుడు ఎస్. డీ లాల్ సినిమాలను గమనిస్తే.. మనకు ఐటం సాంగ్స్ అక్కడి నుంచే ప్రారంభమయ్యా యనే విషయం తెలుస్తుంది. ఆయన ప్రతిసినిమాలో నాభి ప్రాంతాన్ని చూపిస్తూ.. ఐటం సాంగ్ తప్పకుండా ఉంటుంది. ఎక్కడో ఒకచోట సినిమాలో ఐటంసాంగ్ పెట్టాల్సిందే అని అనేవారు. ఈ విషయం బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఉండేది. అయితే.. ఐటం సాంగ్స్ విషయంలో కమలాకర కామేశ్వరరావు.. వంటి సీనియర్లు విభేదించేవారు.
వాళ్లంతా ఎక్కడెక్కడో తిరిగి వస్తారు.. అని కామెంట్ చేశారు.. ఇది ఆనోటా ఈనోటా.. మొత్తానికి ఐటం సాంగ్స్ చేసే జయమాలిని, జ్యోతిలక్ష్మి సహా మరికొందరికి తెలిసింది. దీంతో వారు.. ఈ కామెంట్లపై తమిళ సినీ సంఘంలో (అప్పుడే ఏర్పాటు చేసుకున్నారు) ఫిర్యాదు చేసుకున్నారు.
దీనిపై విచారణ .. జరిగి.. ఐటం సాంగ్స్ చేసినంత మాత్రాన వారిని చిన్న చూపు చూడడానికి వీల్లేదని.. బాలూ మహేంద్ర, బాల చందర్ వంటి అగ్రదర్శకులు(అప్పటికి కాదు) తీర్మానం చేశారు. దీనిపై సంతకాలు చేయడం కోసం. తీర్మానం కాపీని అన్నగారు ఎన్టీఆర్, శివాజీ గణేశన్, భానుమతి, అక్కినేని వంటివారికి పంపించారు.
వీరిలో అక్కినేని సమాధం చెప్పకుండా.. సంతకం కూడా చేయకుండా మౌనంగా ఉన్నారు. కానీ, అన్నగారుమాత్రం తీర్మానం కాపీపై వెంటనే సంతకం చేసి పంపించారు. శివాజీ గణేశన్ కూడా సంతకం చేశారు. కానీ, భానుమతి తిరస్కరిస్తున్నట్టు రాసి సంతకం చేశారు. మొత్తానికి ఇది అప్పట్లో సంచలనంగా మారింది.