గర్భవతిగా ఉన్నప్పుడు చాలామంది స్త్రీలలో ఏ ఆహారం తీసుకోకూడదు అనే సందేహాలు సాధారణంగా వస్తూ ఉంటాయి. అటువంటి టైం లో డాక్టర్స్ చాలా వరకు పోషకాహారం, పండ్లను తీసుకోమని సలహా ఇస్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో తినకూడని కొన్ని పండ్లు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఖర్జూరం సాధారణ సమయాల్లో ఇవి తింటే చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ గర్భిణీ స్త్రీ గా ఉన్నప్పుడు ఈ పండుకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఖర్జూరం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అలాగే గర్భాశయ సంకోచనాలకు కూడా ఖర్జూరం కారణమవుతుంది.
గర్భధారణ సమయంలో గడ్డకట్టిన పండ్లను తినకూడదు. అంటే రిఫ్రిజిరేటర్ లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న పండ్లలో రుచి, పోషణ పోతాయి. అలాగే గడ్డ కట్టిన బెర్రీస్ గర్భంలోని శిశువుపై విషం పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు తాజాగా పండ్లను తీసుకోవడం ఎంతైనా మంచిది. పుచ్చకాయ సాధారణ సమయంలో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరంలో నీటి శాతాన్ని పెంచి.. కొన్ని అనారోగ్యాల నుంచి రక్షించడంతోపాటు శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. కానీ గర్భధారణ సమయంలో పుచ్చకాయ తింటే బిడ్డకు అది చాలా హాని కలిగిస్తుంది. పుచ్చకాయ ఎక్కువగా తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది.
అలాగే మధుమేహం, అలర్జి వంటి లక్షణాలు ఉన్న గర్భిణీ స్త్రీలు అరటిపండును కూడా తీసుకోకపోవడమే మంచిది. ఒక్కొక్కసారి మధుమేహం ఉన్న ఆడవారు అరటి పండ్లను తీసుకోడంవల్ల ఫలితం ప్రాణాంతకం కావచ్చు. అలాగే గర్భధారణ సమయంలో సాధారణంగా మహిళలందరికి పులుపు తినాలనిపిస్తుంది. అదే సమయంలో అందరికీ గుర్తుకు వచ్చేది చింతపండు. ఇది గర్భధారణ సమయంలో మేలు కంటే ఎక్కువ కీడే చేస్తుంది. చింతపండు తినడం వల్ల శరీరంలోని ప్రొజెస్టేరాన్ తగ్గిపోయి గర్భస్రావానికి కారణం కావచ్చు. బొప్పాయి పండును గర్భధారణ సమయంలో తినకూడదు. బొప్పాయి తినడం వల్ల ఫ్రీ మెచ్యూర్ డెలివరీ కావడంతో పాటు ఒక్కొక్కసారి గర్భస్రావానికి కూడా కారణం అవుతుంది. బొప్పాయి నుంచి కారే పాలు గర్భస్రావం కలిగించే అవకాశాలు పెంచుతాయి.