హీరోలు – డైరెక్ట‌ర్ల గొడ‌వ‌ల‌తో ఆగిపోయిన టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులు ఇవే..!

ఇండస్ట్రీలో హీరోలకి, డైరెక్టర్లకి మధ్య గొడవల జరగడం మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. అలా హీరో, డైరెక్టర్ల మధ్య గొడవలు జరిగే ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. కొన్ని సినిమాలు గొడవల కారణంగా ఆగిపోతే మరికొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఆగిపోయాయి. అలా ఆగిపోయిన కొన్ని సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.

నాగచైతన్య – పరుశురామ్‌ :
డైరెక్టర్ పరుశురాం డైరెక్షన్‌లో గీతగోవిందం సినిమా వచ్చి భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాగచైతన్య తో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ బాబు నుంచి ఆఫర్ రావడంతో ఆయన నాగచైతన్యని పక్కనపెట్టి ముందు మహేష్ బాబు సినిమాను రూపొందించాడు. అదే సర్కారు వారి పాట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించిన తరువాత మళ్ళీ నాగ చైతన్య సినిమా చేయడానికి పరుశురామ్‌ అడగగా మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ రాగానే నా సినిమాని వదిలేసి వెళ్లిపోయావని ఉద్దేశంతో పరశురామ్‌తో సినిమా చేయాన‌ని నాగచైతన్య చెప్పాడ‌ని టాక్ ?

మహేష్ బాబు – సుకుమార్ :
సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేయాలి. దానికి సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా మహేష్ బాబుకి సుకుమార్ వినిపించాడట. మహేష్ బాబుకు స్టోరీ అంతగా నచ్చకపోవడంతో చిన్న మార్పులు చేయమని సుకుమార్ కి చెప్పాడట. ఈ సినిమా షూటింగ్ టైం లో కూడా కథలో మార్పులు జరగకపోవడంతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి మహేష్ బాబు సుకుమార్ తో సినిమాను ఆపేశాడు. ఈ విషయం మహేష్ బాబు ఓపెన్ గా ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.

విశ్వక్సేన్ – అర్జున్ :
ఇటీవల కాంట్రవర్షయ‌ల్ హీరోగా పేరు తెచ్చుకున్న విశ్వక్సేన్, యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కల్సి ఉంది. వీరిద్దరి మధ్య కొన్ని గొడవలు కారణంగా ఈ సినిమా ఆగిపోయిందట. సినిమా స్టోరీలో విశ్వక్ వేలు పెట్టడం అర్జున్ కి నచ్చకపోవడంతో తన పైన సీరియస్ అయ్యాడట అ క్రమంలో వీరిద్దరి మధ్యన గొడవలు జరిగి ఈ సినిమా ఆగిపోయిందట.