పీకల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు.. త్వరలోనే పెళ్లి కూడా..!!

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన వారిలో తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు కూడా వినిపిస్తాయి. ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ వ్యవహారాలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ యాక్టర్ జాకీ భ‌గ్నాని ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకున్నామంటూ చట్టపట్టలేసుకుని తిరగడమే కానీ ఇప్పటివరకు పెళ్లి పై ఎటువంటి స్పందన లేదు.

మిల్కీ బ్యూటీ తమన్నా – విజయ్ వర్మతో లస్ట్ స్టోరీస్ 2 లో ఎన్నో బోల్డ్ సన్నివేశాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ తాజాగా వారి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఎప్పటికప్పుడు వీరు వారితో కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న తమన్నా – విజయవర్మ కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే అంశంపై ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదు.

దీంతో రకుల్ – జాకీ బాగ్నాని , తమన్న – విజయవర్మల ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటలు ఎక్కుతుందా..? లేదా..? అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇక ఈ ఇరువురి జంటలకు సన్నిహితంగా ఉండే సినీ విశ్లేషకులు మాత్రం వీరు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారు. వీరు ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటున్నారు అని మాట్లాడుకుంటున్నారట‌. ఈ ఇరువురి జంటల కుటుంబాలు పెళ్లి ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండు జంటలు ఇకనైనా పెళ్లి విషయంపై క్లారిటీ ఇస్తారో? లేదో? చూడాలి.