తెలుగు చిత్ర పరిశ్రమలో సెకండ్ గ్రేడ్ హీరోలలో గోపీచంద్ కూడా ఒకరు. తొలివలపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కాస్త రూటు మార్చి జయం, నిజం, వర్షం సినిమాలో విలన్ గా నటించి భయపెట్టాడు గోపీచంద్. ఆ సినిమాల్లో ఆయన నటనకు సినీ విమర్శకుల దగ్గర్నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. విలన్ గా తన నటనతో మెప్పించిన గోపీచంద్ మళ్లీ హీరోగా నటించి సూపర్ హిట్ కొట్టాడు. గోపీచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం యజ్ఞం. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
ఈ సినిమాను నూతన దర్శకుడు రవికుమార్ చౌదరి తెరకెక్కించగా ఈతరం ఫిలింస్ బ్యానర్ పై పోకూరి బాబురావు నిర్మించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ కు జంటగా సమీరా బెనర్జీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదలకు ముందే పాటలు కూడా మంచి విజయం సాధించాయి. ఇదే సమయంలో ఈ సూపర్ హిట్ సినిమాకి ముందుగా అనుకున్న హీరో గోపీచంద్ కాదట.
టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త ప్రకారం ఈ మూవీకి హీరోగా ముందుగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ను అనుకున్నారట. కానీ డైరెక్టర్ కొత్త కావడంతో ప్రభాస్ ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఇదే స్టోరీని మరో నందమూరి కళ్యాణ్ రామ్కు చెప్పగా కళ్యాణ్ రామ్ కూడా మధ్యలో పలు కారణాలు చేత ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత చివరికి ఇదే స్టోరీ గోపీచంద్ వద్దకు రావడంతో ఆయన ఈ సినిమాకు ఓకే చేశాడు. ఇక సినిమా విడుదలై ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇదే సినిమాలో ప్రభాస్- కళ్యాణ్ రామ్ నటించి ఉంటే వారి క్రేజ్ మరో లెవల్ లోకి వెళ్ళలేదని కచ్చితంగా చెప్పవచ్చు. ఇలా ఈ ఇద్దరు హీరోలు వారి కెరీర్ లోనే ఓ గొప్ప సినిమాని వదులుకున్నారు.