టాలీవుడ్లో డేరింగ్ అండ్ డెషింగ్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు పూరి జగన్నాథ్. అతడి దర్శకత్వంలో ఎంతోమంది హీరోలకు హిట్ ఇచ్చి స్టార్ హీరోలుగా మారడానికి కారణమయ్యాడు. ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్న పూరీ జగన్నాథ్ కొంతకాలంగా సక్సెస్ పరంగా కాస్త డల్ అయ్యాడు.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్గా మరో సినిమాను తీయబోతున్నాడు. ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నాడట పూరి. అతడి డైరెక్షన్లో ఇప్పటికి ఎంతోమంది ? కొత్త హీరోయిన్లను పరిచయం చేశాడు. వారిలో చాలామంది స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. కొంతమంది ఒకటి రెండు సినిమాలతోనే సర్దుకున్నారు.
ఇంతకీ అలా పూరి డైరెక్షన్లో 21 మంది హీరోయిన్స్ టాలీవుడ్కి పరిచయమయారు. వారెవరో ఒకసారి చూద్దాం. పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన వారిలో అమీషా పటేల్, రేణు దేశాయ్, అనుష్క శెట్టి, అశిన్, హన్సిక, కంగనా, అదా శర్మ, నేహా శెట్టి, అనన్య పాండే, దిశాపటాని, తను రాయ్ లాంటి వారు ఉన్నారు. వీరందరూ ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా కొనసాగారు. కొంతమంది ఇప్పటికీ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు.