మహానటి సావిత్రి అంటే.. ఒక ధైర్యం.. ఒక నమ్మకం.. అనే మాట సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించేది. ఎందుకంటే.. ఆమె అంతలా అందరితోనూ కలిసిమెలిసి పనిచేసేవారు. ఎవరు సమస్యల్లో ఉన్నా.. ఆమె స్పందించేవారు. వారికి దన్నుగా నిలిచేవారు. అయితే.. ఇది ఎక్కువ రోజులు కొనసాగలేదు. తర్వాత తర్వాత.. ఆమె నిర్వేదానికి గురయ్యారు. పెద్దగా ఎవరినీ పట్టించుకునేవారు కాదు.
సమస్యలపైనా స్పందించేవారు కాదు. నిజానికి ఇండస్ట్రీలో మహిళలకు ఏం జరిగినా.. సావిత్రికి ముందు తెలుస్తుంది. ఆ సమయంలో నిజానికి కన్నాంబ, హేమలత వంటి సీనియర్లు ఉన్నా.. సావిత్రి ముందు.. వారు కూడా సైలెంట్ అయ్యేవారు. అంత చొరవ తీసుకుని సావిత్రి అందరికీ తలలో నాలుకగా పనిచేసేవారు. అలాంటి సావిత్రి జెమినీ గణేశన్తో వివాహం తర్వాత.. సైలెంట్ అయ్యారు.
అదే సమయంలో కామెడీ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు సమస్యలు వచ్చాయి. వీటిపై స్పందించాలని.. వీరంతా కూడా సావిత్రి కి మొర పెట్టుకున్నారు. కానీ, ఆమె స్పందించలేదు. ఇక, మహిళా సంఘాల్లో అప్పటి వరకు ఎంతో చురుగ్గా పాల్గొన్న సావిత్రి తర్వాత మౌనంగా ఉండిపోయారు. ఎక్కడా ఏ కార్యక్రమం అన్నా వెళ్లేవారు కాదు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు.
దీనిని గమనించిన వారు.. ఆమె ఏదో ఇబ్బందుల్లో ఉందని అర్ధం చేసుకునేవారు. ఈ విషయాన్ని కొంత శోధించిన దర్శకుడు దాసరి నారాయణరావు.. జెమినీగ ణేశన్తో సావిత్రికి విభేదాలు తలెత్తినట్టు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆమె దగ్గర ఆయన ప్రస్తావించారు. దీంతో కొన్ని కొన్ని సందర్భాలు ఇంతే అని సరిపుచ్చుకున్నారట.