మన తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ తర్వాత అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి ఈ కుటుంబం నుంచి మొదటి తరం హీరోగా అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అగ్ర హీరోగా ఎదిగి తెలుగు చిత్రపరిశ్రమలోనే తిరుగులేని ఘనతను అందుకున్నాడు. అలాంటి అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఆయన తనయుడు అక్కినేని నాగార్జున కూడా తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పటికీ ఆరు పదుల వయసు వచ్చిన వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. నాగార్జున సినిమాల్లోకి రాకముందే మరో టాలీవుడ్ అగ్ర నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మితో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత విక్రమ్ సినిమాతో నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే భారీ డిజాస్టర్ అందుకున్న నాగార్జున ఆ తర్వాత వచ్చిన గీతాంజలి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, శివ వంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్నాడు. అంతే కాకుండా తెలుగులోనే స్టార్ హీరోగా ఎదిగాడు.
నాగార్జున, లక్ష్మితో పెళ్లి జరిగిన సంవత్సరానికి వీరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి నాగచైతన్య జన్మించాడు. లక్ష్మితో విడిపోయాక నాగార్జున తనతో పాటు సినిమాల్లో నటించిన మరో స్టార్ హీరోయిన్ అమలతో ప్రేమలో పడ్డాడు. నాగార్జున- అమల ముందుగా కిరాయి దాదా అనే సినిమాలో కలిసి నటించారు.
ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత శివా సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. శివ సినిమాతో వారిమధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి పెళ్లికి అక్కినేని నాగేశ్వరరావు ఒప్పుకోకపోవడంతో కిరాయి దాదా సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన దొరస్వామి రాజు వీరి పెళ్లిని దగ్గర ఉండి తిరుపతిలో జరిపించాడు. పెళ్లి తర్వాత అమల చిత్ర పరిశ్రమకు దూరమైంది.