ఎన్టీఆర్- మహేష్- పవన్ లను స్టార్ హీరోలుగా మార్చిన లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా..!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ముగ్గురు హీరోలు టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్టార్లుగా దూసుకుపోతున్నారు. ఇక్కడ ఈ ముగ్గురు హీరోలకు ఓ లక్కీ హీరోయిన్ ఉంది. ఆమె కారణంగానే ఈ ముగ్గురికి ఇంత స్టార్డమ్‌ వచ్చింది. ఇంతకీ ఆ గోల్డెన్ హీరోయిన్ ఎవరో మీరు చెప్పగలరా. ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా.. ఢిల్లీలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ సుమంత్ హీరోగా వచ్చిన యువకుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. పవన్‌తో నటచిన ఖుషి సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంది.

అదేవిధంగా ఖుషి సినిమాతో పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మంచి హోదా కూడా వచ్చింది. తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య తెర‌కెక్కించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్- భూమిక కెమిస్ట్రీ కూడా ప్రేక్షకల‌ను ఎంతగానో ఆకట్టుకుందానే చెప్పాలి. ఆ తర్వాత భూమిక- ఎన్టీఆర్ కు జంటగా నటించింది. దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన సింహాద్రి సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎన్టీఆర్ వరుసగా రెండు భారీ ప్లాప్‌లు మూట‌గ‌ట్టుకుని స‌త‌మ‌తం అవుతున్న ఎన్టీఆర్‌ `సింహాద్రి`తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం అందుకుని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే ఎన్టీఆర్ ను స్టార్ హీరోగా కూడా మార్చింది. ఆ తర్వాత భూమిక మహేష్‌కు జంటగా ఒక్కడు సినిమాలో నటించింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు ముందు రాజ‌కుమారుడు, మురారి తప్పితే మహేష్ కెరీర్ లో సరైన విజయం లేదు.

కానీ ఒక్కడు మహేష్ కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మహేష్ కు స్టార్డ‌మ్ కూడా వచ్చింది. అలా భూమిక, ఎన్టీఆర్, మహేష్, పవన్ లను స్టార్ హీరోల‌గా మార్చి వారికి ల‌క్కీ హీరోయిన్‌గా మారింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ మూడు సినిమాలు కూడా ఇటీవల రీ రిలీజ్ చేశారు. అయితే ఈ రీ రిలీజ్ లోను ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మరోసారి దుమ్ము దులిపేసాయి.