చిరంజీవి హీరోగా ఏవిఎం బ్యానర్ లో వచ్చిన పున్నమినాగు సినిమా ఇప్పటికి 43 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరంజీవి కెరీర్ మొదటిలో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. అలాగే ఈ సినిమాలో చిరంజీవి నటనకు గాను ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. అలాగే ఈ సినిమా ఏవీఎం సంస్థ నుంచి వచ్చింది. ఇదే సమయంలో ఈ సంస్థ నుంచి వచ్చే సినిమాలలో అప్పట్లో ఒక వార్త వైరల్ గా మారేది.
అది ఏమిటంటే వారు తీసే సినిమాల్లో కచ్చితంగా పాములు ఉంటాయని. అలాగే పున్నమినాగు సినిమా కూడా ఇంచుమించు అలాంటిదే. ఇక ఈ సినిమాలో చిరంజీవి నాగులుగా ఎంతో అద్భుతమైన నటన చూపించాడు. ఈ మూవీలో చిరు తండ్రిగా చేసిన వ్యక్తి అతనికి చిన్నప్పటినుంచి అతని ఆహారంలో విషం కలిపి ఇచ్చేవాడు. దానివల్ల అతను పాము కాటు వేసినా మరణించేవాడు కాదు.
కానీ అదే సమయంలో ప్రతి పౌర్ణమికి నాగులు పాముల ప్రవర్తించేవాడు, ఆ సమయంలో ఒక అమ్మాయి కోసం ఎదురు చూసేవాడు. ఆ సమయంలో అతనితో కలిసిన అమ్మాయి చనిపోయి ఉండేది. ఆ ఊర్లో రాజు అనే అతను అమ్మాయిలు ఎందుకు ? చనిపోతున్నారని కారణం వెతకగడం మొదలుపెట్టారు. పాము కాటు వేసినట్టు కనపడటం లేదు.. కానీ విషయం వల్ల అమ్మాయిలు చనిపోతున్నారని.. రాజు నాగుల మీద నిఘా వేసి అతన్ని పట్టుకుంటాడు.
అప్పుడే నాగులకు తన ఒంట్లో విషయం ఉందని విషయం తెలుస్తుంది. ఇదే విషయాన్ని నాగుల తండ్రి నీ ఒంట్లో విషం ఉందనే విషయం చెబుతాడు. ఇక దీంతో నాగులు తన వల్ల ఇంతమంది చనిపోతున్నారని బాధతో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఈ సినిమాను రాజశేఖర్ తెరకెక్కించారు. ఈయన అప్పట్లో రజినీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోల సినిమాలను తెర్కెక్కించేవారు.
ఈ సినిమాకు కథ కూడా అగ్ర రచయిత రామనారాయణ ఇచ్చారు. సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఓ మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయింది. అయితే ఈ పున్నమినాగు సినిమాకి కీర్తి సురేష్ కు ఉన్న సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా. ఈ సినిమాలో హీరోయిన్గా మేనక నటించింది. ఇక ఆమె మరి ఎవరో కాదు కీర్తి సురేష్ తల్లి.
మేనకకి మొదటి తెలుగు సినిమా పున్నమినాగు, కీర్తి సురేష్ తల్లి మలయాళం లో అప్పట్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. మళయాళం లో ఎన్నో సినిమాలు కూడా చేసింది. ఆ తర్వాత కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది కానీ తెలుగులో రెండు సినిమాలు మాత్రమే చేసింది. అందులో తొలి సినిమా పున్నమినాగులో చిరంజీవి పక్కన నటించింది. ఇక ఇప్పుడు మేనక కూతురు కీర్తి సురేష్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. ఈ సినిమాలో చిరుకు జంటగా తమన్నా నటిస్తుంది.