టాలీవుడ్ లో ప్రభాస్ – అనుష్క కాంబినేషన్కి ఎంతో క్రేజ్ ఉంది. మొదట అనుష్క – ప్రభాస్ కలిసి నటించిన బిల్లా సినిమా ఫ్లాప్ అయినా ఈ జోడికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. దీంతో మిర్చి సినిమాలో కూడా ఈ జంట మళ్ళీ కలిసిన నటించారు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన బాహుబలి సినిమా లో ప్రభాస్ సరసన హీరోయిన్గా అనుష్క నటించి మెప్పించింది. వరుసగా ఇద్దరు కాంబినేషన్లో ఇన్ని సినిమాలు రావడంతో వారిద్దరి మధ్యన మంచి బాండింగ్ ఏర్పడింది. అప్పట్లో వీరిద్దరూ పీకలోత్తు ప్రేమలో ఉన్నారని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారా ..? లేదో..? తెలియదు కానీ వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇక అనుష్క.. ప్రభాస్ తో ఉన్న చనువుతోనే ఆమెకు వచ్చిన ఒక కథ స్క్రిప్ట్ గురించి ప్రభాస్ కి వినిపించగా .. ఈ సినిమాలో నువ్వు నటించ వద్దు అని ప్రభాస్ – అనుష్కకు చెప్పేశాడట. అయినా కథ నచ్చడంతో అనుష్క ఆ సినిమాలో నటించింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా తన క్యారెక్టర్ కు ప్రశంసలు అందుకుంది అనుష్క. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా.. అల్లు అర్జున్, మంచు మనోజ్, దీక్ష సేథ్ – అనుష్క కీ రోల్స్ ప్లే చేసిన వేదం.
ఈ సినిమాలో అనుష్క వేశ్య పాత్ర పోషించింది. అప్పటికే టాలీవుడ్ లో స్టార్డమ్ సంపాదించుకున్న అనుష్క వేశ్య పాత్రలో నటించడానికి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ప్రభాస్ కూడా అనుష్క వేశ్య పాత్రలో నటిస్తే ఆమె ఇమేజ్ పోతుందనే ఉద్దేశంతోనే ఈ సినిమాను చేయొద్దని చెప్పాడట. ఇక ఈ సినిమా ఫ్లాప్ అయినా అనుష్క నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన వేదం సినిమాలో అనుష్క క్యారెక్టర్ బాగా క్లిక్ అవ్వడంతో ప్రభాస్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత.. ఈ సినిమాలో నీ యాక్టింగ్ ఆ క్యారెక్టర్ డిజైన్చేసిన విధానం బాగుందని స్వయంగా అనుష్కతో చెప్పాడట.