అప్ఘానిస్తాన్తో జరుగుతోన్న ఏకైక టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం దిశగా దూసుకుపోతోంది. తన రెండో ఇన్సింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగుల స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 662 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ఆప్ఘాన్ ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు స్కోర్ చేసింది. ఈ క్రమంలోనే బంగ్లా బ్యాట్స్మెన్ నజ్మల్ హుస్సేన్ సంతో అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్లో 175 బంతుల్లో 146 పరుగులు చేసిన సంతో రెండో ఇన్సింగ్స్లోనూ సెంచరీతో కదం తొక్కాడు. 115 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న సంతూ ఇన్సింగ్స్లో ఏకంగా 14 ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తరపున ఒకే టెస్టులో రెండు ఇన్సింగ్స్ల్లోనూ సెంచరీలు బాదిన రెండో క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు.
అంతకుముందు మెమినుల్ హుక్ 2018లో చిట్టగ్యాంగ్లో శ్రీలంకతో జరిగిన టెస్టులో రెండు సెంచరీలు చేశాడు. తొలి ఇన్సింగ్స్లో 176, రెండో ఇన్సింగ్స్లో 105 పరుగులు చేశాడు. ఇలా ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన వారిలో వరల్డ్ వైడ్గా 91వ క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు.
ఇక ఈ టెస్టులో అప్గాన్ విజయం సాధించడం అసాధ్యం. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. చేతిలో కేవలం 8 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 617 పరుగుల చేయాలి. దీంతో బంగ్లా ఘనవిజయం ఖాయం.