ఎంపీ నందిగంకు అదిరిపోయే చెక్… టీడీపీ ట్విస్ట్ మామూలుగా లేదుగా…!

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి అదృష్టం కొద్ది గెలిచిన నేతల్లో నందిగం సురేష్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఈయన అమరావతి విషయంలో ఎలాంటి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలిసిందే. ఇక గత ఎన్నికల్లో తొలిసారి సీటు దక్కించుకుని జగన్ గాలిలో బాపట్ల ఎంపీగా నందిగం గెలిచారు. కేవలం 16 వేల ఓట్ల మెజారిటీతో సురేష్ గెలిచారు. అయితే బాపట్ల పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో పర్చూరు, అద్దంకి, చీరాల, రేపల్లె స్థానాల్లో టి‌డి‌పి గెలిచింది..సంతనూతలపాడు, బాపట్ల, వేమూరు స్థానాల్లో వైసీపీ గెలిచింది.

MP Nandigam Suresh in trouble over allegations on falsifying the caste certificate

అయినా ఎంపీ సీటుని వైసీపీ గెలుచుకోవడానికి కారణం టి‌డి‌పి నేత మాల్యాద్రిపై ఉన్న వ్యతిరేకత. క్రాస్ ఓటింగ్ పడటం వల్ల సురేష్ తక్కువ మెజారిటీతో గెలిచారు. ఇక ఎంపీగా సురేష్..బాపట్లకు చేసింది ఏమి లేదు. పైగా రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారు..ఇక ప్రతిపక్ష నేతలని తిట్టడం తప్ప సురేష్ చేసే వేరే పని లేదు. దీంతో ఈయనపై బాపట్లలో తీవ్ర వ్యతిరేకత ఉంది.

ఈ సారి ఈయన పోటీ చేస్తే గెలవడం కష్టం..ఒకవేళ వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసిన గెలిచే ఛాన్స్ లేదు. ఎందుకంటే బాపట్ల పరిధిలో ఉన్న అన్నీ అసెంబ్లీ స్థానాల్లో టి‌డి‌పికి లీడ్ ఉంది. అయితే ఇక్కడ టి‌డి‌పి తరుపున ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. మళ్ళీ మాల్యాద్రికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు.

తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు తొల‌గించండి..! ఈసీ కి అందిన ఫిర్యాదు..!! | Ban the cycle symbol to tdp..! complained to EC..!! - Telugu Oneindia

అటు తాడికొండ ఇంచార్జ్ తెనాలి శ్రావణ్ కుమార్‌ని బాపట్ల ఎంపీగా నిలబెట్టవచ్చనే టాక్ వస్తుంది. కానీ శ్రావణ్ తాడికొండ వదిలేలా లేరు. మరి బాపట్ల ఎంపీగా టి‌డి‌పి తరుపున ఎవరు నిలబడతారో చూడాలి. ఇక ఎవరు నిలబడిన ఇక్కడ టి‌డి‌పి గెలవడం ఖాయమనే పరిస్తితి ఉంది.