ఇప్పుడు ప్రస్తుతం ఇదే వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో వైరల్ గా మారింది.. అక్కినేని కుటుంబంలో ఉన్న హీరోలందరూ విజయం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంటే అవును అని అంటున్నారు అక్కినేని అభిమానులు .ఇదే సమయంలో అక్కినేని నాగార్జున 23 సంవత్సరాలు తర్వాత మళ్లీ ఆ హీరోయిన్ తో కలిసి నటించబోతున్నాడట. ఇప్పటికే అక్కినేని కుటుంబానికి సంబంధించిన పలు వార్తలు చిత్ర పరిశ్రమలో ఏ రెంజ్లో ట్రెండ్ అవుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే.
గత రెండు సంవత్సరాలగా ఒక్కటంటే ఒక విజయం అందుకు లేకపోతున్న ఈ అక్కినేని హీరోలు ఎలాగైనా సరే ఈసారి రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరాలని బాగా ఫిక్స్ అయిపోయారట. ఈ క్రమంలోనే నాగార్జున తన తర్వాత సినిమాను ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తో ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు మంగళవారం అనే ఓ హార్రర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే నాగార్జునతో ఒక క్రేజీ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడట.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో నాగార్జునకు జంటగా సీనియర్ హాట్ బ్యూటీ టబును హీరోయిన్గా ఫిక్స్ చేశారట. నాగార్జున, టబు కాంబోకి ప్రేక్షకులలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా నాగార్జున కూడా అందుకు ఒప్పుకొని టబుతో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ఇక మరి అతి త్వరలోనే ఈ సీనియర్ జంట వెండి తెరపై మరోసారి తమ హాట్ రొమాన్స్ తో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు నాగార్జున హిట్ కోసం మొత్తానికి టబుని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. ఈ విధంగా అయిన అక్కినేని హీరోల జాతకం మారుతుందో లేదో చూడాలి..?