డయాబెటిస్ ఈ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. మనదేశంలో రోజు రోజుకు డయాబెటిస్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మన దేశంలో కోట్లాది మందికి ఈ వ్యాధి ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మనదేశంలో చాలామంది ప్రజలు ఈ వ్యాధికి గురయ్యారు. 2009లో ఏకంగా 42 లక్షల మంది కేవలం డయాబెటిస్ వల్ల చనిపోయారు.
ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే డయాబెటిస్ తీవ్రత అలా ఉందంటే ఇప్పుడు మరింత తీవ్రతరమవుతోంది. చాలామంది బయట దొరికే పిజ్జా, బర్గర్లు, తినటానికి ఇష్టపడతారు. దీనివల్ల బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
మొలకెత్తిన విత్తనాలు, జ్యూసులు కంటే కూడా పండ్లు తినడం చాలా మంచిది. ఎందుకంటే జ్యూస్గా చేసి వడకట్టినప్పుడు అందులో ఉండే పీచు పదార్థం మొత్తం పోతుంది. ముఖ్యంగా కాకరకాయ జ్యూస్ తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ప్రతిరోజు టైంకి తిని పడుకోవడం చేసినట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
డయాబెటిస్ ఇది వరకు పెద్ద వయస్సు వాళ్లకు మాత్రమే వచ్చేది. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ఈ వ్యాధి వచ్చేస్తోంది. దీంతో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పండ్లు, జ్యూస్ లు, ఆకుకూరలు తీసుకుంటే చాలా వరకు షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.