అతిలోకసుందరిగా పేరొందిన శ్రీదేవి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆమె కన్నుమూశాక ఫ్యాన్స్ ఆమె కూతురు జాన్వీ కపూర్ పట్ల తమ అభిమానాన్ని చూపించడం స్టార్ట్ చేశారు. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తన తెలుగు అభిమానులను కూడా పలకరించునుంది. ఎన్టీఆర్ 30వ మూవీ దేవర ద్వారా ఈ ముద్దుగుమ్మ శ్రీదేవి అభిమానులకు సుపరిచితం కానుంది.
తెలుగువారికే మాత్రమే కాదు జాన్వీకి కూడా తెలుగు సినిమాలపై చాలా ఆసక్తి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30 సినిమాలో నటించే అవకాశం రావడం ఆమె అదృష్టంగా భావిస్తోంది. త్వరలోనే ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ క్రమంలోనే ఆమెపై ఒక ప్రచారం జరుగుతోంది. అదేంటంటే జాన్వీ కపూర్ నిర్మాతలకు కొన్ని విచిత్రమైన కండిషన్లు పెడుతుందట.
దాంతో నిర్మాతలు జాన్వీతో సినిమా తీయడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. అసలు జాన్వీ కపూర్ కండిషన్ కి ఒప్పుకొని సినిమా తీయడానికి ముందుకు వచ్చే నిర్మాతలు ఉంటారా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఒక్కో సినిమాకి నాలుగు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
అతిలోకసుందరిగా పేరొందిన శ్రీదేవి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆమె కన్నుమూశాక ఫ్యాన్స్ ఆమె కూతురు జాన్వీ కపూర్ పట్ల తమ అభిమానాన్ని చూపించడం స్టార్ట్ చేశారు.
ఇప్పుడు ఎన్టీఆర్కి జంటగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తే ఆమె రేంజ్ మారిపోతుందని కొంతమంది అంటున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ సినిమా తర్వాత జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోవడం ఖాయమని మరికొందరు చెబుతున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక అసలు జాన్వీ పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది.
ఇక కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’ సినిమాలో హీరోయిన్ పాత్ర మధ్యలోనే చనిపోతుందని తెలియడంతో తన పాత్ర అలా మధ్యలోనే ఆగిపోవడం తనకి ఇష్టం లేదని, సినిమా మొత్తం తన పాత్ర ఉండేలా స్క్రిప్ట్ మార్చమని కండిషన్ పెట్టిందట జాన్వి. ఎందుకంటే జాన్వీ కపూర్ నటించబోయే మొదటి సినిమా కాబట్టి తన పాత్రని మధ్యలోనే చంపడం ఆమెకి నచ్చలేదట.
అందుకే కొరటాల శివకు ఈ కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. మరి జాన్వీ కపూర్ పెట్టిన కండిషన్కి కొరటాల శివ ఒప్పుకుంటాడా ? లేదా అనేది తెలియాలంటే సినిమా విడుదల అయ్యేంతవరకూ వేచి చూడాల్సిందే.