టాలీవుడ్లో యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సూపర్స్టార్ మహేష్బాబుకు ఉన్న క్రేజ్ తెలిసిందే. ఈ ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్ల దగ్గర టిక్కెట్లు దొరకవు.. జనాల జాతరతో థియేటర్లో హోరెత్తిపోవాలి. ఈ ఇద్దరు హీరోలకు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.
ఇక ఈ ఇద్దరు హీరోలు ఇటు సినీ లైఫ్లో ఎంత బిజీ ఉన్నా.. అటు పర్సనల్ లైఫ్లో తమ భార్యలు, పిల్లలకు కూడా మంచి స్పేస్ ఇస్తారు. తాజాగా బయటకు వచ్చిన ఓ వార్త మహేష్ బాబు, ఎన్టీఆర్ అభిమానులకు మాంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. ఇప్పటివరకు వీళ్ళిద్దరూ ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నారు.
గతంలో ఒకరి సినిమాలకి ఒకరు సాయం చేసుకుంటూ వచ్చారు కూడా..! ఇంకా ఆ బాధ్యతలను వారి పిల్లలు తీసుకుంటున్నారని టాక్ ? ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల వారసులు కూడా కలిసి నటించడం నిజంగానే సెన్షేషనల్ న్యూస్ అని చెప్పాలి. మహేష్ బాబు కూతురు సితార, ఎన్టీఆర్ పెద్ద కొడుకు
అభయ్ రామ్ కలిసి ఓ సినిమాలో కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్లో కొద్ది నిమిషాల పాటు సితార, అభయ్ రామ్ తెరమీద కనపడతారట. వీరిద్దరు ఈ సినిమాలో అక్కా, తమ్ముడు పాత్రల్లో కనిపిస్తారట. దీంతో ఫస్ట్ టైం ఎన్టీఆర్ కొడుకు, అటు మహేష్ కూతురు సినిమాల్లోకి రాబోతున్నారన్న వార్త అయితే హైలెట్ అవుతోంది.