ఆయన పాట వింటే పిల్లలు సైతం ఎంతో హాయిగా నిద్రపోతారు.. వాళ్లకు జోలపాడినట్టే ఉంటుంది. అంతటి మధుర గాత్రం కలిగిన ఏకైక గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఈ లోకం విడిచి వెళ్లిపోయిన ఆయన పాటల రూపంలో ఎప్పుడూ బ్రతికే ఉంటారు. మన భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప గాయకుడుగా పేరు పొందున ఎస్పీ బాలు 50 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు.
ఇక ఎస్పీ బాలు జీవించి ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. తాను పాట పాడిన తొలి సినిమా శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాకు 300 రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఆ రోజుల్లో ఘంటసాల గారు రూ.500 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేవారని ఎస్పీ బాలు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మా నాన్నగారు నెలకు 80 రూపాయలు పంపేవారని బాలు గుర్తు చేసుకున్నారు.
ఇక అప్పుడు 300 రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోవటంతో నాలుగు నెలల పాటు మా నాన్నగారి దగ్గర నుంచి డబ్బులు అడగాల్సిన అవసరం లేకుండా వచ్చిందని ఆ మధురక్షణలను గుర్తుచేసుకున్నారు.ఆ సమయంలో స్నేహితునితో కలిసి వుడ్ ల్యాండ్స్ కు వెళ్లి మసాలా దోశ, గులాబ్ జామ్ తిన్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఆరోజు జేమ్స్ బాండ్ సినిమా కూడా చూసినట్టు బాలు గుర్తు చేసుకున్నారు.
ఆ పాట తర్వాత నేను కన్నడలో పాటలు పాడానని.. ఆ పాటలకు 150 రూపాయలు రెమ్యునరేషన్ దక్కిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత నాన్నకు ఇంటికి డబ్బులు పంపే శక్తి వచ్చిందని ఎస్పీ బాలు చెప్పుకొచ్చారు. అ రోజుల్లో పెద్ద పారితోషికం అంటే 500 రూపాయలు అని చెక్ రూపంలో నేను ఆ మొత్తాన్ని అందుకున్నానని ఎస్పీ బాలు పేర్కొన్నారు. ఎస్పీ బాలు చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మీరాయి.