మ‌హేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌: గుంటూరు కారం మ‌ళ్లీ పోస్ట్ పోన్‌… త్రివిక్ర‌మ్ సంక‌నాకించేస్తున్నాడు…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం. ఖ‌లేజా, అత‌డు సినిమాల త‌ర్వాత 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ కాంబోలో వ‌స్తోన్న ఈ సినిమా పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. పూజాహెగ్డే – శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసాయి.

Guntur Karam Movie Posters

 

మహేష్ బాబు మంచి ఊరమాస్ రోల్లో క‌నిపించ‌నున్న ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌లో ఫ్యామిలీ అంశాలు, సెంటిమెంట్ కూడా పుష్క‌లంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ఎన్నోసార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం మ‌రోసారి ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డిన‌ట్టుగా తెలుస్తోంది.

తాజా షెడ్యూల్ త‌ర్వాత గుంటూరు కారంకు కొద్ది రోజుల పాటు బ్రేక్ త‌ప్ప‌దంటున్నారు. మ‌హేష్‌బాబు కొద్ది రోజుల పాటు విదేశాల‌కు వెళ్లి రానున్నార‌ట‌. ఈ లోగా ఇత‌ర న‌టీన‌టుల‌పై షూటింగ్ ఉంటుంద‌ని చెపుతున్నా ఏదో అనుమానాలు అయితే వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్‌ను ఈ సినిమా నుంచి త‌ప్పించార‌ని పుకార్లు వ‌చ్చాయి. మెయిన్ హీరోయిన్ పూజాహెగ్డే విష‌యంలోనూ అదే రూమ‌ర్లు వినిపించాయి.

Pooja Hegde Biography/Wiki, Age, Height, Career, Photos & More

 

ఇప్పుడు మ‌హేష్ మ‌రోసారి విదేశాల‌కు వెళుతుండ‌డంతో అస‌లు గుంటూరు కారం షూటింగ్ విష‌యంలో ఏం జ‌రుగుతుందో ? అర్థం కావ‌డం లేదు. ఏదేమైనా రెండు మూడు సార్లు మ‌హేష్ ఇంట్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తో ఈ సినిమా షూట్ లేట్ అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేయ‌డంతో షూటింగ్ ఏ మాత్రం ముందుకు క‌ద‌ల‌డం లేదు.

త్రివిక్ర‌మ్ అయితే ప‌వ‌న్ సినిమాల‌పై ఫోక‌స్ పెడుతూ గుంటూరు కారం సినిమాను సంక‌నాకించేస్తున్న‌ట్టుగానే క‌నిపిస్తోంది. అందుకే మ‌హేష్ అభిమానులు కూడా త్రివిక్ర‌మ్ మీద చాలా గుర్రుగా ఉన్నారు.