బిగ్ బ్రేకింగ్ : సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపగిలేలా ఏడుస్తున్న హీరోయిన్ నిత్యమీనన్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

బెంగళూరు బ్యూటీ నిత్యమీనన్ అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ కావడంతో వరుస అవకాశాలను అందుకున్న నిత్యమీనన్ ఆచితూచి కధ‌లని ఎంచుకుంటూ తనదైన స్టైల్ లో రాణిస్తుంది. అవకాశాలు వచ్చినప్పటికీ కథలో తన పాత్రకు ప్రాధాన్యత లేదనుకుంటే సినిమాను రిజెక్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే తెలుగు తమిళం మలయాళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యమీన‌న్ ఎన్నో హిట్ సినిమాలను ఆమె ఖాతాలో వేసుకుంది.

స్కిన్ షో చేయకుండా స్టార్డం సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోయిన్‌ల‌లో నిత్యమీనన్ ఒకరు. తాజాగా నిత్యామీనన్ కు సంబంధించిన ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిత్యమీనన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిత్యమీనన్‌కి చాలా ఇష్టమైన తన అమ్మమ్మ గారు చనిపోయింది . ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది నిత్యమీనన్.

అమ్మమ్మతో ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టమని.. ” మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను.. గుడ్ బాయ్ అమ్మమ్మ.. అండ్ మై చెర్రీ మాన్.. ఇప్పటినుంచి మరొక కోణంలో నిన్ను చూసుకుంటా ” అంటూ ఎమోషనల్ గా నిత్యమైన నోట్‌ రాసుకుంది. దీంతో నిత్యమీన‌న్ అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు. నిత్య అమ్మ‌మ‌ ఆత్మకి శాంతి చేకూరాలని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ కూడా నిత్యమీనన్ పోస్ట్ కు రెస్పాండ్ అవుతూ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు..!