సినిమా ఛాన్సులు వదులుకొని మరి.. రాజకీయాల్లోకి వెళ్లి కరివేపాకుగా మారిన టాలీవుడ్ కమెడియన్లు వీళ్లే..!!

ఇప్పటికే టాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు చాలామంది నటులు. ఇక సినిమాల్లో సక్సెస్ సాధించిన వాళ్ళు రాజకీయాల్లో సక్సెస్ అవుతున్నారా అంటే కొంతమంది అవును అంటున్నారు కొంతమంది వారు సక్సెస్ కాలేరు అనే కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది కమెడియన్లు మాత్రం ఏదో సాధించాలని రాజకీయాల్లోకి అడుగుపెట్టి సినిమా ఆఫర్లను కోల్పోతూ ఇటు రాజకీయాలకి అటు సినిమాలకి మెల్లమెల్లగా దూరం అవుతున్నారు. మంచి ఫలితాలను సొంతం చేసుకోకపోగా విమర్శల పాలవుతున్నారు.

వారిలో మొదటగా ఆలి పేరే వినిపిస్తుంది. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు కమెడియన్‌గా నటించి ఓ వెలుగు వెలిగిన అలీకి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. వైసీపీ తరఫున మంచి పదవిలో ఉన్న అలీ.. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మాత్రం ఒక మిత్ర ద్రోహిగా మిగిలిపోయాడు. కోట్ల మంది ప్రస్తుతం ఆలీని ద్వేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఆలీని దూరంగా పెడుతున్నారు. భవిష్యత్తులో పవన్ – అలీ కలిసి ఇక నటించే ఛాన్స్ లేదు.

పోసాని కృష్ణ మురళి ఒకప్పుడు రచయితగా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పోసాని ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పాటు రాజకీయాల్లోనూ గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. పవన్‌ను విమర్శించేంతవరకు మాత్రమే పోసాని రాజకీయాలు పరిమితమైపోయాయి. ఇకపై రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ పోసాని మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు కనిపించడం లేదు. పృథ్వీరాజ్‌ని కూడా ప్రజలను పట్టించుకునే పరిస్థితిలు అయితే లేవు.

కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ కెరీర్ పరంగా రాజకీయాల్లో ఎదగడం అంత సులువు కాదు. ప్రస్తుతం పృథ్వీరాజ్‌తో పాటు పోసాని కృష్ణ మురళి, అలీ కూడా రాజకీయాల్లో మంచి స్టేజ్ కు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వీరు రాజకీయాల్లోకి వచ్చి కరివేపాకుల మారారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు జనం. రాజకీయాల్లోకి రావడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది అనడానికి ఉదాహరణ వీళ్లే అంటూ అభిప్రాయపడుతున్నారు.