పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత… ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌.. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌కు ఎలా ఉందంటే…!

పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత… ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌.. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌కు ఎలా ఉందంటే…!
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వారాహి విజయ యాత్ర పేరుతో విశ్రాంతి లేకుండా పర్యటనలు చేస్తున్నారు. దీనికి తోడు ఉపవాస దీక్ష పాటిస్తుండడంతో కూడా పవన్ ప్రస్తుతం అనారోగ్యానికి గురైనట్టు జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఫంక్షన్ హాల్ విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఈరోజు 11 గంటలకు భీమవరం నియోజవర్గ నేతలతో నిర్వహించాల్సిన సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. ఈ రోజు సాయంత్రం తర్వాత ఈ భేటీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరోవైపు పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారని తెలియడంతో ఆయన అభిమానులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.

అయితే పవన్ యాత్రలతో. సినిమాల‌ షూటింగ్‌లతో బిజీగా ఉండడంతో ఆరోగ్యం కాస్త అస్వస్థత‌కు గురైనట్టు వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో పవన్‌ను కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారట. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ప‌వ‌న్‌ నాలుగు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. వాటిలో బ్రో, ఓజి సినిమాల షూటింగ్ మాత్రమే ఎంతో వేగంగా జరుగుతుంది.

బ్రో సినిమాలో పవన్‌తో పాటు ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా కూడా వచ్చే నెల 28వ తేదీన‌ ప్రేక్షకుల‌ ముందుకు రానుంది. ఇక డిసెంబ‌ర్లో ఓజీ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.