చిరంజీవి ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాను డైరెక్ట్ చేశార‌న్న విష‌యం తెలుసా..!

టాలీవుడ్‌లో మెగా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి త‌న కేరీర్‌లో 150కి పైగా సినిమాల‌లో న‌టించారు. ఎన్నో బాక్ల్‌బ‌స్ట‌ర్ హిట్‌ల‌ను అందుకున్నారు. ఇప్ప‌టికి కూడా వ‌రుస సినిమాలు చేసుకుంటు యంగ్ హీరోల‌కు కూడా గ‌ట్టి పోట్టి ఇస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య సినిమాతో సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ప్ర‌స్తుతం చిరు భోళా శంక‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. తాజాగానే ఈసినిమా టీజ‌ర్ కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా కూడా ఆగ‌స్ట్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. భోళా శంక‌ర్ రిలీజ్ డేట్ ఆగస్టు 11గా ఇప్ప‌టికే ఎనౌన్స్ చేసేశారు. ఇక చిరంజీవి హీరోగానే కాకుండా ఆయ‌న కేరీర్‌లో ప‌లు సినిమాల‌కు ద‌ర్శ‌కుడిగా కూడా ప‌ని చేశార‌నే విష‌యం చాలా మందికి తెలియ‌దు.

చిరు త‌న కేరీర్‌లో ఎన్నో సినిమాల‌లో న‌టించారు. ఇక అందులో ఇంద్ర సినిమాకు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమా మాస్ ద‌ర్శ‌కుడు బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చింది. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ద‌ర్శ‌కుడు గోపాల్ ఎన్టీఆర్‌తో అల్ల‌రి రాముడు సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఆరు రోజుల తేడాలో రిలీజ్ అయ్యాయి. ఆ స‌మ‌యంలో చిరు ఇంద్ర సినిమాకు ఒక్కోసారి టైం కేటాయించ‌లేని ప‌రిస్థితి.

ఆ స‌మ‌యంలో చిరంజీవి ఇంద్ర సినిమాకు ద‌ర్శ‌కుడిగా మారాడు అనే విష‌యం చాల మందికి తెలియ‌దు. ఇక చిరు డైర‌క్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమాలో ప‌లు సిన్లు సినిమాకే హైలేట్‌గా నిలిచాయి. ఇక సినిమా కూడా బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు బి. గోపాల్ తెర‌కెక్కించిన మ‌రో సినిమా అల్ల‌రి రాముడు మాత్రం యావ‌రేజ్‌గా నిలించింది. ఈ విధంగా చిరు త‌న ప్ర‌తి సినిమాల విష‌యంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునే వారు. అందుకే అయ‌న కెరీర్‌లో ఎక్కువ హిట్లు ఉన్నాయి.