మెగా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకడు. సాయిధరమ్ తేజ్ మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తన స్టైల్ లో కథలను ఎంచుకుంటూ తన సినిమాల ద్వారా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సాయిధరమ్ తేజ్ తో పాటు అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలుసు. ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హిట్ సాధించాడు. తర్వాత రెండు సినిమాలలో నటించినా అవి ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.
సాయి ధరంతేజ్ రీసెంట్ మూవీ విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వీరి పర్సనల్ విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న సంగతి చాలామందికి తెలుసు. సాయిధరమ్ తేజ్ తల్లిదండ్రులు విజయదుర్గ, పంజా ప్రసాద్ చాలా కాలం క్రితం విడాకులు తీసుకున్నారు. అయితే దానికి ప్రధాన కారణం మెగా ఫ్యామిలీ అంటూ వార్తలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగక ముందే విజయదుర్గకు పంజా ప్రసాద్ కు వివాహం అయిందట. పంజా ప్రసాద్ది భీమవరం దగ్గర్లోని వీరవాసరం. చిరంజీవి రౌడీ అల్లుడు సినిమాకు పంజా ప్రసాద్ కూడా ఓ నిర్మాత. పంజా ప్రసాద్ కి చిరంజీవి ఫ్యామిలీ కంటే కొంచెం పలుకుబడి అప్పట్లో ఎక్కువగానే ఉండేదట. తర్వాత మెగాస్టార్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సూపర్ స్టార్ గా ఎదిగిన తరువాత మెగా ఫ్యామిలీ తమ ఇంటి అల్లుళ్లకు కూడా నియమాలు పెట్టి చెప్పు చేతల్లో ఉంచుకోవాలని ప్రయత్నించిందంటారు.
పంజా ప్రసాద్ కు అది నచ్చక విజయ దుర్గతో విడాకులు తీసుకున్నాడని ప్రచారం ఉంది. సాయి ధరంతేజ్ తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకున్నా పంజా ప్రసాద్ ఎప్పుడు కొడుకుని కలవడానికి వస్తూనే ఉంటాడట. పంజా ప్రసాద్ కి ఇటీవల కాలంలో హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు సాయి తేజ్ దగ్గరుండి తండ్రికి కావాల్సినవన్నీ చూసుకున్నాడట. అలాగే గతంలో సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా తండ్రి పంజా ప్రసాద్ కొడుకు వద్దే ఉన్నారట.