టాలీవుడ్ లో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ఎంత క్రేజీ కాంబినేషనో అందరికీ తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్లో మొదటిగా s/o సత్యమూర్తి వచ్చి సూపర్ హిట్ కాగా అంతకుముందు వచ్చిన జులాయి సినిమా ఎబో యావరేజ్. మళ్ళీ బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ మరో సినిమాలో రిపీట్ అయింది. అదే అలవైకుంఠపురంలో.. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది.
ఈ సినిమాలో పాటలు బ్లాక్ బస్టర్ చార్టర్ అయ్యాయి. ఈ పాటలు ఇప్పటికీ చాలామంది నోట్లో వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా రొటీన్ స్టోరీ అయినా కామెడీ తో మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు త్రివిక్రమ్. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. అప్పట్లో కేవలం తెలుగు వర్షన్ కి రూ.160 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసింది.
ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావడానికి వెనుక ఒక కారణం ఉందట.. ఈ సినిమాలో ముందు రాసుకున్న స్క్రిప్ట్ కాకుండా కొన్ని మార్కులు చేర్పులు చేశారట. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్కి సెకండ్ హాఫ్లో స్టోరీ ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది అనిపించిందట. ఇదే విషయాన్ని త్రివిక్రమ్ కి చెప్పగా త్రివిక్రమ్ అప్పటికప్పుడు కొన్ని సన్నివేశాల్లో మార్పులు, చేర్పులు చేయడం.. కొన్ని సన్నివేశాలు కొత్తగా క్రియేట్ చేశాడట.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో బోర్డ్ మీటింగ్ సన్నివేశం ఈ సినిమాలో ముందుగా రాసుకున్న స్క్రిప్ట్లో లేదట. అప్పటికప్పుడు ఈ సన్నివేశాన్ని త్రివిక్రమ్ క్రియేట్ చేశాడట. ఈ సీన్ సినిమాలో ఎంత హైలెట్గా నిలిచింది. ఇలా ఎన్నో మార్పులు, చేర్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం వల్లే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రొటీన్ అనే ఫీలింగ్ వస్తే ఈ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయేది. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్లో నాలుగో సినిమా రానున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.