ఫస్ట్ వీకెండ్ సూపర్ హిట్ అయిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు సోమవారం నుంచి అగ్నిపరీక్ష మొదలైంది. తొలి మూడు రోజులు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.340 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తొలి రోజు ఏకంగా రూ.140 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా రెండో రోజు రూ.100 కోట్లు మూడోరోజు రూ.100 కోట్లు రాబట్టింది. దీంతో మూడు రోజులకు ఏకంగా రూ. 340 కోట్లు వచ్చాయి.
ఫస్ట్ వీకెండ్ వరకు సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే మొదటి మూడు రోజులతో పోలిస్తే సోమవారం నుంచి ఈ సినిమాకు పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. సోమవారం ఈ సినిమా ఆక్యుపెన్సి 45% పడిపోయిందని వసూళ్లు కూడా 70 శాతం డ్రాప్ అయినట్టు ట్రేడ్ చెబుతోంది. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే నార్త్ బెల్ట్ లో ఈ సినిమా వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో ట్రేడ్ వర్గాల్లో పెద్ద ఆందోళన నెలకొంది. నార్త్ ఇండియాలో తొలి మూడు రోజులు రోజుకు రూ.35 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా చాలా సింపుల్ గా 100 కోట్లు దాటేసింది.
అయితే సోమవారం మరీ ఘోరంగా రూ.9 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఇప్పటికే రామాయణాన్ని బాగా వక్రీకరించి తీశారు అన్న టాక్ నార్త్లో బాగా స్ప్రెడ్ అయింది. దీంతో ఫ్యామిలీలతో సహా ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. హిందీలో ఈ సినిమా కోలుకోవటం కష్టమే అంటోంది ట్రేడ్. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సోమవారం ఆదిపురుష్ వసూళ్లు బాగా పడిపోయాయి. సోమవారం అన్ని సెంటర్లలోనూ డ్రాప్స్ బాగా కనిపించాయి. ఇది ప్రతి సినిమాకు ఉండేదే అయినా ఆదిపురుష్ సినిమాకు భారీ బిజినెస్ జరగడంతో ఆందోళన ఎక్కువగా ఉంది.
ఇప్పటివరకు ఏపీ తెలంగాణలో రూ.65 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రూ.70 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే అది జరగటం అసాధ్యంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా మరో వారం పది రోజులపాటు సినిమా గట్టిగా పికప్ అయితేనే తప్ప ఈ సినిమా బ్రేక్ ఈవెన్కు వచ్చేలా లేదు. లేదంటే ప్రభాస్ ఖాతాలో వరుసగా మరో డిజాస్టర్ పడినట్టే అవుతుంది.!!